News September 10, 2024
పారాలింపిక్స్ ‘గోల్డ్’ విజేతలకు రూ.75 లక్షలు: మాండవీయ

పారిస్ పారాలింపిక్స్లో పతకాలు సాధించిన అథ్లెట్లను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ సత్కరించారు. గోల్డ్ మెడలిస్టులకు ₹75 లక్షలు, సిల్వర్ విజేతలకు ₹50 లక్షలు, బ్రాంజ్ పతకాలు సాధించిన వారికి ₹30 లక్షల నగదు బహుమతి ప్రకటించారు. మిక్స్డ్ టీమ్ ఈవెంట్స్లో రాణించిన ప్లేయర్లకు ₹22.50 లక్షలు అందజేస్తామని చెప్పారు. 2028 పారాలింపిక్స్లో మరిన్ని పతకాలు సాధించేందుకు వీలుగా శిక్షణ, సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
Similar News
News December 2, 2025
ఈ సారి చలి ఎక్కువే: IMD

దేశంలో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో 4-5 రోజులు ఎక్కువగా కోల్డ్ వేవ్స్ ఉంటాయని చెప్పింది. కాగా దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.


