News September 7, 2024
రూ.9 కోట్ల రాయి.. వాకిలి మెట్టుగా వాడిన బామ్మ

చెట్ల నుంచి వచ్చే ఒకరకమైన స్రావం గట్టిపడి వేల ఏళ్లకు శిలాజంగా మారుతుంది. దాన్ని అంబర్ అంటారు. ఇది ఎంతో విలువైనది. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద అంబర్లలో ఒకదాన్ని రొమేనియాలో గుర్తించారు. ఓ బామ్మ ఇంటి వాకిట్లో దాన్ని మెట్టుగా వాడేవారు. కొడుకూ దాన్ని సాధారణ రాయిగానే చూశాడు. తర్వాత దాని విలువను గుర్తించి ప్రభుత్వానికి విక్రయించాడు. దాని బరువు 3.5KG. వయసు 7 కోట్ల ఏళ్లని, విలువ ₹9cr ఉంటుందని అంచనా.
Similar News
News November 8, 2025
CSIR-IIIMలో ఉద్యోగాలు

CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్(<
News November 8, 2025
కోళ్ల దాణా నిల్వ.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

కోళ్లకు మంచి దాణా అందించినప్పుడే వాటి పెరుగుదల బాగుంటుంది. అయితే దాణా నిల్వలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెటర్నరీ అధికారులు సూచిస్తున్నారు. దాణా బస్తాలను నేలపై కాకుండా చెక్క పలకల మీద ఉంచాలి. గోడలకు తగలకుండా చూడాలి. తేమగా ఉన్న దాణాను నిల్వ చేయకూడదు. 2-3వారాలకు మించి దాణా నిల్వ ఉంచకూడదు. వేడిగా ఉన్న దాణాను చల్లబడిన తర్వాత మాత్రమే గోదాముల్లో నిల్వ ఉంచాలి. లేదంటే బస్తాలపై తేమ ఏర్పడి బూజు పడుతుంది.
News November 8, 2025
భారత్, ఆస్ట్రేలియా మ్యాచుకు అంతరాయం

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న ఐదో టీ20 నిలిచిపోయింది. బ్యాడ్ వెదర్, వర్షం వచ్చే అవకాశం ఉండటంతో అంపైర్లు మ్యాచును నిలిపివేశారు. ప్రస్తుతం టీమ్ ఇండియా స్కోర్ 4.5 ఓవర్లలో 52-0గా ఉంది. అభిషేక్ 23, గిల్ 29 రన్స్ చేశారు.


