News September 7, 2024
రూ.9 కోట్ల రాయి.. వాకిలి మెట్టుగా వాడిన బామ్మ

చెట్ల నుంచి వచ్చే ఒకరకమైన స్రావం గట్టిపడి వేల ఏళ్లకు శిలాజంగా మారుతుంది. దాన్ని అంబర్ అంటారు. ఇది ఎంతో విలువైనది. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద అంబర్లలో ఒకదాన్ని రొమేనియాలో గుర్తించారు. ఓ బామ్మ ఇంటి వాకిట్లో దాన్ని మెట్టుగా వాడేవారు. కొడుకూ దాన్ని సాధారణ రాయిగానే చూశాడు. తర్వాత దాని విలువను గుర్తించి ప్రభుత్వానికి విక్రయించాడు. దాని బరువు 3.5KG. వయసు 7 కోట్ల ఏళ్లని, విలువ ₹9cr ఉంటుందని అంచనా.
Similar News
News December 3, 2025
రాగి పాత్రలు వాడుతున్నారా?

ఆరోగ్యం కోసం ప్రస్తుతం చాలామంది రాగిపాత్రల వాడకం మొదలుపెట్టారు. అయితే వీటిలో కొన్ని ఆహారపదార్థాలు పెట్టేటపుడు జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. రాగిపాత్రలో పెట్టిన పెరుగును తింటే వికారం, వాంతులు, విరేచనాలు అవుతాయి. అలా-గే సిట్రస్ ఫ్రూట్స్తో పెట్టిన పచ్చళ్లు, ఆహారాలు రాగితో రసాయన చర్యలు జరుపుతాయి. కేవలం నీటిని, అదీ 8-12 గంటలపాటు నిల్వ ఉంచిన నీటినే తాగాలని సూచిస్తున్నారు.
News December 3, 2025
చెలరేగిన బ్యాటర్లు.. భారత్ భారీ స్కోర్

సౌతాఫ్రికాతో రెండో వన్డేలో భారత్ 358/5 రన్స్ చేసింది. ఓపెనర్లు రోహిత్(14), జైస్వాల్(22) నిరాశపరచగా.. రుతురాజ్(105) వన్డేల్లో తొలి సెంచరీ బాదారు. కోహ్లీ(102) వరుసగా రెండో వన్డేలోనూ శతకం నమోదు చేశారు. రాహుల్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, వరుసగా రెండో అర్ధసెంచరీ(66*) చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో జాన్సెన్ 2, బర్గర్, ఎంగిడి తలో వికెట్ తీశారు.
News December 3, 2025
రేవంత్ క్షమాపణలు చెప్పాలి: కిషన్ రెడ్డి

TG: హిందూ దేవుళ్లను సీఎం రేవంత్ అవమానించేలా మాట్లాడారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. CM రేవంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి భూములు అమ్మకపోతే పూట గడవని పరిస్థితి ఉందని విమర్శించారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూర్చేందుకు సీఎం రేవంత్ హిల్ట్ పాలసీని తీసుకొచ్చారని ఆరోపించారు.


