News February 3, 2025

APకి రూ.9,417కోట్లు, TGకు రూ.5,337 కోట్లు: అశ్వినీ వైష్ణవ్

image

రైల్వే బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాల కేటాయింపులపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు. ‘తెలంగాణకు రూ.5,337cr, APకి రికార్డు స్థాయిలో రూ.9,417cr కేటాయించాం. తెలంగాణ వ్యాప్తంగా 1,326KM కవచ్ టెక్నాలజీ పని చేస్తోంది. APకి UPA హయాంలో కంటే 11రెట్లు ఎక్కువ కేటాయించాం. APలో 73రైల్వే‌స్టేషన్ల అభివృద్ధికి నిధులిచ్చి రూపురేఖలు మారుస్తున్నాం. రూ.8,455cr విలువైన రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేశాం’ అని అన్నారు.

Similar News

News November 18, 2025

అమిత్ షా డెడ్‌లైన్‌కి ముందే హిడ్మా ఎన్‌కౌంటర్!

image

AP: అల్లూరి(D) మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఎన్‌కౌంటర్‌ జరిగిన విషయం తెలిసిందే. భద్రతా బలగాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా విధించిన డెడ్‌లైన్‌ కంటే ముందే ఇది జరిగిందని తెలుస్తోంది. 2026 మార్చి 31నాటికి దేశంలో నక్సలిజాన్ని రూపుమాపాలని అమిత్ షా గడువు విధించిన విషయం తెలిసిందే. అప్పుడే NOV 30లోపు హిడ్మా ఎన్‌కౌంటర్ జరగాలని ఆదేశాలిచ్చారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

News November 18, 2025

అమిత్ షా డెడ్‌లైన్‌కి ముందే హిడ్మా ఎన్‌కౌంటర్!

image

AP: అల్లూరి(D) మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఎన్‌కౌంటర్‌ జరిగిన విషయం తెలిసిందే. భద్రతా బలగాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా విధించిన డెడ్‌లైన్‌ కంటే ముందే ఇది జరిగిందని తెలుస్తోంది. 2026 మార్చి 31నాటికి దేశంలో నక్సలిజాన్ని రూపుమాపాలని అమిత్ షా గడువు విధించిన విషయం తెలిసిందే. అప్పుడే NOV 30లోపు హిడ్మా ఎన్‌కౌంటర్ జరగాలని ఆదేశాలిచ్చారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

News November 18, 2025

వాట్సాప్‌లో ‘మీ-సేవ’.. Hi అని పంపితే చాలు!

image

TG: ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాట్సాప్ ద్వారా మీ-సేవా సర్వీసులను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580కి పైగా సర్వీసులను వాట్సాప్ ద్వారా పొందే అవకాశముంది. 80969 58096 నంబర్‌కు Hi అని మెసేజ్ చేసి సేవలు పొందవచ్చు. ఇన్‌కం, బర్త్, క్యాస్ట్, డెత్ సర్టిఫికెట్ల దరఖాస్తుతో పాటు విద్యుత్, నీటి బిల్లులు, ఆస్తి పన్నులు చెల్లించవచ్చు.