News March 27, 2025
సూర్యలంక బీచ్ అభివృద్ధికి రూ.97.52 కోట్లు

AP: బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.97.52కోట్లు విడుదల చేసింది. స్వదేశీ దర్శన్ స్కీమ్ 2.0 కింద ఈ నిధులు విడుదల చేసినట్లు మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు. ‘అంతర్జాతీయ ప్రమాణాలతో సూర్యలంక బీచ్ను తీర్చిదిద్దుతాం. నిధులు విడుదల చేసిన కేంద్ర మంత్రి షెకావత్కు ధన్యవాదాలు. పర్యాటకాభివృద్ధిని ప్రోత్సహిస్తున్న సీఎం, డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు’ అని మంత్రి వివరించారు.
Similar News
News October 14, 2025
విదేశీ విద్యపై విప్లవాత్మక నిర్ణయం

TG: విదేశీ విద్యా పథకంలో BC, SC, ST విద్యార్థుల సంఖ్య రెట్టింపు చేస్తూ CM రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. గతంలో బీసీ విద్యార్థుల్లో లబ్ధిదారుల సంఖ్య 300కాగా ఇప్పుడు అది 700కు చేరనుంది. BC-C, Eలతో కలుపుకుంటే విద్యార్థుల సంఖ్య 1000కి చేరుతుంది. SC విద్యార్థుల సంఖ్య గతంలో 210 ఉండేది. అది ఇప్పుడు 500కు చేరనుంది. ST స్టూడెంట్స్లో లబ్ధిదారులు 100మంది మాత్రమే ఉండేవారు. వాళ్లిప్పుడు 200కు చేరనున్నారు.
News October 14, 2025
OBC ఆదాయ పరిమితి పెంచమన్న కేంద్రం

OBC రిజర్వేషన్ల కోసం క్రీమీ లేయర్ ఆదాయ పరిమితి పెంచే యోచన లేదని కేంద్రం స్పష్టం చేసింది. సాధారణంగా నిర్దేశించిన ఆదాయం కంటే ఎక్కువుంటే ప్రభుత్వ విద్య, ఉపాధిలో రిజర్వేషన్లు రావు. ఆఖరిసారి 2017లో రూ.6 లక్షలుగా ఉన్న పరిమితిని రూ.8 లక్షలకు పెంచింది. ఇప్పటికే 2020, 2023లో పెంపు గడువు ముగిసింది. ఈ లిమిట్ పెంచితే పేద OBC వర్గాలకు రిజర్వేషన్లలో పోటీ కష్టమవుతుందనే కేంద్రం అంగీకరించట్లేదని తెలుస్తోంది.
News October 14, 2025
అక్టోబర్ 14: చరిత్రలో ఈ రోజు

1956: బౌద్ధమతం స్వీకరించిన BR అంబేడ్కర్(ఫొటోలో)
1980: సినీ నటుడు శివ బాలాజీ జననం
1981: టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ జననం
1982: కవి సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి మరణం
1994: బొగద సొరంగం పనుల ప్రారంభం
1998: అమర్త్యసేన్కు నోబెల్ బహుమతి
2010: సినీ రచయిత సాయి శ్రీహర్ష మరణం
2011: తెలుగు రచయిత జాలాది రాజారావు మరణం
*వరల్డ్ స్టాండర్డ్స్ డే