News April 16, 2025

రూ. 4687 కోట్లతో అమరావతి సచివాలయ నిర్మాణం

image

AP రాజధాని అమరావతిలో సచివాలయ టవర్ల నిర్మాణానికి CRDA టెండర్లను ఆహ్వానించింది. 1,2 టవర్ల నిర్మాణానికి రూ.1,897కోట్లు, 3, 4 టవర్ల నిర్మాణానికి రూ.1,664 కోట్లతో టెండర్లను పిలిచింది. వీటితో పాటు HOD ఆఫీసుకు రూ.1,126 కోట్లతో అదనంగా మరో టవర్ నిర్మాణానికీ టెండర్లను పిలిచింది. అటు అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణానికి ఇప్పటికే టెండర్లను ప్రభుత్వం ఖరారు చేసింది.

Similar News

News April 19, 2025

చిన్నస్వామిలో మారని RCB కథ!

image

IPL: PBKSపై ఓడిన RCB ఓ చెత్త రికార్డ్ మూటగట్టుకుంది. హోంగ్రౌండ్‌లో 46 మ్యాచులు ఓడిన జట్టుగా నిలిచింది. గతంతో ఈ రికార్డ్ ఢిల్లీ పేరిట ఉండేది. ఆ జట్టు అరుణ్‌జైట్లీ స్టేడియంలో 45 మ్యాచులు ఓడింది. కాగా, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం చిన్నది కావడం RCBకి తొలి నుంచీ మైనస్సే అని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. గతంతో భారీ స్కోర్లు చేసినా డిఫెండ్ చేసుకోలేక చాలా మ్యాచ్‌లు ఓడిపోయిందని అంటున్నారు.

News April 19, 2025

వేమన పద్యం

image

ఉన్నతావు వదలి ఊరూరు దిరిగిన
కన్నదేమి నరుడు గ్రాసమునకు
తన్నులోను జూడ తమమెల్ల వీడును
విశ్వదాభిరామ వినుర వేమ.
భావం: ఉన్నచోటును విడిచి తీర్థయాత్రలు చేసినంత మాత్రాన ఉపయోగం లేదు. తనలో తాను చూసుకుంటే అజ్ఞానం తొలగిపోతుంది.

News April 19, 2025

ఆ హామీ ఇప్పట్లో అమలు కాకపోవచ్చు: కూనంనేని

image

TG: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన తులం బంగారం హామీ ఇప్పట్లో అమలు కాకపోవచ్చని MLA కూనంనేని సాంబ శివరావు అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా ప్రభుత్వానికి కష్టంగా ఉందని వ్యాఖ్యానించారు. ఖమ్మంలో విమానాశ్రయం ఏర్పాటు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పరిస్థితి డోలాయమానంలో ఉందన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం కోసం ఎవరికీ రుపాయి కూడా ఇవ్వొద్దని సూచించారు.

error: Content is protected !!