News April 5, 2025

RSS నెక్స్ట్ టార్గెట్ క్రిస్టియన్ల ఆస్తులే: రాహుల్

image

వక్ఫ్ సవరణ బిల్లు తర్వాత RSS దృష్టి క్రిస్టియన్ ఆస్తులపై పడిందని రాహుల్ గాంధీ అన్నారు. ముస్లింలే లక్ష్యంగా వక్ఫ్ సవరణ బిల్లును తీసుకొచ్చిన కేంద్రం తర్వాత ఇతర మతాలనూ టార్గెట్ చేస్తుందని తాను గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో 7కోట్ల హెక్టార్లలో క్యాథలిక్ చర్చిలు ఉన్నాయని RSS సంబంధిత పోర్టల్ ప్రచురించినట్లు తెలిపారు. రాజ్యాంగం మాత్రమే ఇలాంటి దాడుల నుంచి ప్రజలను కాపాడగలదని ట్వీట్ చేశారు.

Similar News

News December 19, 2025

నేటి ముఖ్యాంశాలు

image

❁ AP: చంద్రబాబుకు ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు
❁ ‘PPP’ తప్పనుకుంటే నన్ను జైలుకు పంపు జగన్: సత్యకుమార్
❁ వైద్యం కోసం పేదలు ఆస్తులు అమ్ముకోవాలి: జగన్
❁ గతేడాదితో పోలిస్తే ఏపీలో నేరాలు తగ్గుముఖం: DGP
❁ TG: గ్రామపంచాయతీ ఎన్నికల్లో 66% సీట్లు మావే: రేవంత్
❁ గ్రూప్-3 ఫలితాలు విడుదల.. 1,370 మంది అభ్యర్థులు ఎంపిక
❁ KCR అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు: KTR
❁ SMAT విజేతగా ఝార్ఖండ్

News December 19, 2025

మెస్సీ ఈవెంట్.. రూ.50 కోట్ల పరువునష్టం దావా వేసిన గంగూలీ

image

నిర్వహణ లోపం వల్ల కోల్‌కతాలో ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ ఈవెంట్ రద్దైన సంగతి తెలిసిందే. కాగా ఈ ఈవెంట్‌కు మధ్యవర్తిగా వ్యవహరించారన్న AFCK ప్రెసిడెంట్ ఉత్తమ్ సాహా ఆరోపణలపై సౌరభ్ గంగూలీ పరువు నష్టం దావా వేశారు. నిరాధారమైన సాహా వ్యాఖ్యలు తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని రూ.50 కోట్లు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తనకు ఈవెంట్‌తో ఎలాంటి సంబంధం లేదని, కేవలం గెస్ట్‌గా హాజరయ్యానని ఆయన స్పష్టం చేశారు.

News December 19, 2025

మూడు నెలల్లో ఒకే గ్రామంలో 27వేల జననాలు.. తీరా చూస్తే!

image

MH యావత్మల్(D) శేందుర్సనీ GPలో గత మూడు నెలల వ్యవధిలో ఏకంగా 27,397 జననాలు నమోదవ్వడం కలకలం రేపింది. 1,500 మంది ఉండే ఈ గ్రామంలో ఈ సంఖ్యలో జననాలు ఉండటం సైబర్ కుట్రగా అధికారులు భావిస్తున్నారు. వీటిలో 99శాతం ఎంట్రీలు వెస్ట్ బెంగాల్, UP నుంచే ఉన్నాయని BJP నేత కిరీట్ సోమయ్య అన్నారు. ఈ విషయంపై CMతో మాట్లాడి బర్త్ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. కాగా దీనిపై కేసు నమోదైంది.