News March 18, 2025
RTC ఎండీ సజ్జనార్ క్రేజ్ ఇప్పుడు ఇంటన్నేషనల్

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ Say no to betting apps #Tag తర్వాత దేశ, విదేశాల్లో ఫాలోయింగ్ భారీగా పెరిగింది. మీరు చెప్పేది నిజమే సర్ అంటూ లక్షలాది మంది కామెంట్లు పెడుతున్నారు. సజ్జనార్ ఇన్స్టాను 65 లక్షల మంది చూడగా X హ్యాండిల్ను 72 లక్షల మంది చూశారు. విదేశాల్లో మొరాకో, యూఎస్, యూఏఈ, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, కువైట్ దేశాల వాసుల నుంచి ఆయనకు సపోర్ట్ లభిస్తోంది.
Similar News
News December 15, 2025
బాపట్ల కలెక్టరేట్కు 173 అర్జీలు

బాపట్ల కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కారం వేదికకు 173 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద ఆయన నేరుగా అర్జీలను సేకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నమోదైన ప్రతి అర్జీని పోర్టల్లో నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అర్జీలను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు.
News December 15, 2025
NZB: ముగిసిన 3వ విడత ఎన్నికల ప్రచార పర్వం

నిజామాబాద్ జిల్లాలో 3వ విడతలో 12 మండలాల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం
సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మూడో విడతలో ఆర్మూర్ డివిజన్లోని ఆలూర్, ఆర్మూర్, బాల్కొండ, భీమ్గల్, డొంకేశ్వర్, కమ్మర్పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్ల మండలాల పరిధిలో గల గ్రామాలలో బుధవారం పోలింగ్ జరుగనుంది
News December 15, 2025
కామారెడ్డి: ముగిసిన మూడో విడత ప్రచారం

కామారెడ్డి జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రచార పర్వం ముగిసింది. జిల్లాలోని 8 మండలాల్లో ఈ నెల 17న పోలింగ్ జరగనుంది. గత వారం రోజులుగా ఈ గ్రామాలలో మైకులు, ప్రచార వాహనాలు సందడి చేశాయి. సాయంత్రం 5 గంటల తర్వాత బహిరంగ ప్రచారాలు, మైకులు మూగబోతాయి. అలాగే, పోలింగ్ ముగిసే వరకు వైన్స్లు, కళ్ళు దుకాణాలు కూడా మూతపడనున్నాయి.


