News November 16, 2024

నిరసనలకు ఆర్టీసీ, సీపీఎస్ ఉద్యోగుల పిలుపు

image

AP: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఎంప్లాయీస్ యూనియన్ మండిపడింది. ఈ నెల 19, 20 తేదీల్లో అన్ని డిపోలు, జోనల్ వర్క్‌షాపుల వద్ద నిరసనలు చేయనున్నట్లు ప్రకటించింది. కూటమి నేతలు హామీ ఇచ్చినట్లుగా సీపీఎస్, జీపీఎస్‌ స్థానంలో కొత్త పింఛన్ పథకాన్ని తీసుకురావాలనే డిమాండ్‌తో డిసెంబర్ 10న ఛలో విజయవాడ నిర్వహించనున్నట్లు సీపీఎస్ ఉద్యోగుల సంఘం వెల్లడించింది.

Similar News

News December 28, 2025

ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో గెలుపొందింది వీళ్లే..

image

ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రొడ్యూసర్స్ సెక్టార్ నుంచి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా అశోక్ కుమార్, సి.కళ్యాణ్, వై.వి.ఎస్.చౌదరి, ప్రసన్న కుమార్, దిల్ రాజు, నాగవంశీ, దామోదర్ ప్రసాద్, మోహన్ వట్లపట్ల, రామసత్యనారాయణ, కె.ఎస్.రామారావు, అమ్మిరాజు, చదలవాడ శ్రీనివాసరావు విజయం సాధించారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి ఐదుగురు గెలుపొందారు.

News December 28, 2025

రేవంత్ Vs కేసీఆర్.. దద్దరిల్లనున్న అసెంబ్లీ!

image

TG: BRS చీఫ్ KCR రేపు అసెంబ్లీ సమావేశాలకు హాజరవడం దాదాపు ఖరారైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ఆయన సభలో జరిగే చర్చలో పాల్గొననున్నారు. అందులోనూ కీలకమైన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై CM రేవంత్, KCR మధ్య మాటల యుద్ధం ఖాయంగా కనిపిస్తోంది. గులాబీ బాస్ సంధించే ప్రశ్నలకు CM తనదైన శైలిలో ఎలా స్పందిస్తారో చూసేందుకు మీరూ సిద్ధమా? రేపు ఉ.10.30 గంటల నుంచి అసెంబ్లీ లైవ్‌ను Way2Newsలో చూడండి.

News December 28, 2025

త్వరలో ఒక్క సిగరెట్ ధర రూ.72

image

ఎక్సైజ్ డ్యూటీ పెంచి సిగరెట్లను కొనలేనంత భారం చేయడానికి కేంద్రం సిద్ధమవుతోంది. ప్రస్తుతం రూ.18కు కొంటున్న ఒక్క సిగరెట్ ధర త్వరలో రూ.72కు పెరగవచ్చని అధికారులు చెబుతున్నారు. సిగరెట్ల వినియోగాన్ని తగ్గించడానికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వడం లేదు. దీంతో రేట్లు పెంచేందుకు సెంట్రల్ ఎక్సైజ్ (అమెండ్‌మెంట్) బిల్‌-2025లో కేంద్రం ప్రపోజల్స్ పెట్టింది. దీనిపై అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.