News November 16, 2024
నిరసనలకు ఆర్టీసీ, సీపీఎస్ ఉద్యోగుల పిలుపు

AP: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఎంప్లాయీస్ యూనియన్ మండిపడింది. ఈ నెల 19, 20 తేదీల్లో అన్ని డిపోలు, జోనల్ వర్క్షాపుల వద్ద నిరసనలు చేయనున్నట్లు ప్రకటించింది. కూటమి నేతలు హామీ ఇచ్చినట్లుగా సీపీఎస్, జీపీఎస్ స్థానంలో కొత్త పింఛన్ పథకాన్ని తీసుకురావాలనే డిమాండ్తో డిసెంబర్ 10న ఛలో విజయవాడ నిర్వహించనున్నట్లు సీపీఎస్ ఉద్యోగుల సంఘం వెల్లడించింది.
Similar News
News December 25, 2025
టుడే టాప్ స్టోరీస్

*20లక్షల ఉద్యోగాల కల్పనకే మొదటి ప్రాధాన్యం: CM CBN
*రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ శిక్షణలో దేశంలోనే AP టాప్
*వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 2/3 మెజార్టీతో గెలుస్తుంది: CM రేవంత్
*2028లోనే ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొంద పెడతారు: KTR
*ఆరావళి పర్వతాల మైనింగ్పై వెనక్కి తగ్గిన కేంద్రం
*ISRO సరికొత్త చరిత్ర.. కక్ష్యలోకి 6,100కిలోల బరువైన బ్లూబర్డ్ శాటిలైట్
News December 25, 2025
PHOTO GALLERY: క్రిస్మస్ సందడి

తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సందడి నెలకొంది. రేపు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఆసియాలోనే అతిపెద్ద చర్చిల్లో ఒకటైన మెదక్ చర్చి విద్యుత్ దీపాలతో వెలిగిపోతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, వరంగల్ తదితర నగరాల్లో చర్చిలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇటు క్రైస్తవులు తమ ఇళ్లను కలర్ఫుల్ లైట్లతో డెకరేట్ చేశారు. క్రిస్మస్ గిఫ్ట్స్ కొనుగోళ్లతో మార్కెట్లూ సందడిగా మారాయి.
News December 25, 2025
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్

TG: రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ శీతాకాల సమావేశాలు ఈ నెల 29న 10.30amకు మొదలవుతాయని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎన్నిరోజులు సమావేశాలు జరగాలనేది BAC భేటీలో నిర్ణయించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి సహా పెండింగ్ ప్రాజెక్టులపై చర్చ జరిగే ఆస్కారముంది. అలాగే MPTC, ZPTC ఎన్నికలు, BCలకు 42% రిజర్వేషన్ల సాధనకు కేంద్రంపై ఏ విధంగా ఒత్తిడి తేవాలనే దానిపై డిస్కస్ చేయనున్నట్లు తెలుస్తోంది.


