News September 1, 2025
ఆర్టీసీ డ్రైవర్లు ఫోన్లు వాడటం నిషేధం!

TG: బస్సు ప్రమాదాలను నివారించేందుకు డ్రైవర్లు విధుల్లో ఫోన్ వాడకుండా నిషేధం విధించాలని RTC నిర్ణయించింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 30 వరకు పైలట్ ప్రాజెక్టుగా 11 డిపోల్లో దీనిని అమలు చేయనుంది. డ్రైవర్లు డ్యూటీ ఎక్కేముందు తమ ఫోన్లను డిపో మేనేజర్కు అప్పగిస్తారు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కండక్టర్కు మేనేజర్ సమాచారమిస్తారు. పైలట్ ప్రాజెక్టు ఫలితాలను బట్టి రాష్ట్రవ్యాప్తంగా అమలుపై సంస్థ నిర్ణయం తీసుకోనుంది.
Similar News
News September 1, 2025
యువత గుండె వయసు వేగంగా పెరుగుతోంది!

మిలీనియల్స్ (1981-96) & GenZ (1997-2012)లలో ‘కార్డియాక్ ఏజింగ్’ అభివృద్ధి చెందుతున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే వారి గుండె సాధారణం కంటే వేగంగా వృద్ధాప్యం చెందడం. అందుకే 50 ఏళ్లలో కనిపించే గుండె జబ్బులు 30 ఏళ్లలోపే చూస్తున్నట్లు చెబుతున్నారు. ఎక్కువసేపు కూర్చోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, దీర్ఘకాలిక ఒత్తిడి, నిద్ర లేకపోవడం, స్క్రీన్ సమయం పెరగడం, ధూమపానం వంటివి ఇందుకు కారణమని తెలుస్తోంది.
News September 1, 2025
అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నా: సుదర్శన్ రెడ్డి

రాజ్యాంగాన్ని కాపాడటం కోసమే తాను వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ‘రాజకీయం అనే ముళ్ల కిరీటాన్ని ఎందుకు నెత్తిన పెట్టుకున్నారని చాలా మంది నన్ను అడిగారు. నేను రాజకీయాల్లోకి రాలేదు. ఏ పార్టీలో సభ్యత్వం లేదు. ఇక ముందూ ఉండదు. పౌరహక్కులు, సామాజిక న్యాయం గురించి పోరాడుతా. నేను ప్రతిపక్షాల అభ్యర్థిని’ అని వ్యాఖ్యానించారు.
News September 1, 2025
ఒకే గదిలో వేర్వేరు బెడ్స్పై దంపతుల నిద్ర

జపాన్ కపుల్స్ నాణ్యమైన నిద్ర కోసం ‘సపరేట్ స్లీపింగ్’ పద్ధతిని పాటిస్తారు. వారు ఒకే గదిలో వేర్వేరు బెడ్స్పై పడుకుంటారు. నిద్రలో గురక పెట్టడం, కదలడం వల్ల తమ భాగస్వామి నిద్రకు భంగం కలుగుతుందని ఇలా వేరుగా పడుకుంటారట. అయితే ఇది జంటల మధ్య దూరాన్ని పెంచుతుందని కొందరు భావిస్తే, భాగస్వామికిచ్చే గౌరవంగా మరికొందరు నమ్ముతున్నారు. కాగా జపాన్లో జననాల రేటు పడిపోవడానికి ఇదీ ఓ కారణం కావొచ్చనే చర్చ జరుగుతోంది.