News April 2, 2025

రేపట్నుంచి RTC ఉద్యోగుల నిరసనలు

image

AP: పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ RTC ఉద్యోగులు నిరసనలకు పిలుపునిచ్చారు. రేపు, ఎల్లుండి ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపనున్నారు. సస్పెన్షన్లు, తొలగింపు లేకుండా 1/2019 సర్క్యులర్ అమలు చేయాలని, వెంటనే పదోన్నతులు చేపట్టాలని, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం లేదా సంస్థ ద్వారానే కొనాలని, నైట్‌అవుట్ అలవెన్స్ ₹150 నుంచి ₹400 వరకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Similar News

News April 3, 2025

జనాలను ఫూల్స్ చేస్తున్న చంద్రబాబు: రోజా

image

AP: ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు జనాలను ఫూల్స్ చేస్తున్నారని వైసీపీ నేత రోజా విమర్శించారు. సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చడం చేతకాకపోతే పదవి నుంచి దిగిపోవాలని ఆమె డిమాండ్ చేశారు. ‘చంద్రబాబు ఈవీఎంలను మేనేజ్ చేస్తారు కానీ కరువును మాత్రం చేయలేకపోతున్నారు. కరువుతో చాలా జిల్లాలు అల్లాడిపోతున్నా పట్టించుకోవడం లేదు. బాబు చెప్పే మాటలకు, చేసే పనులకు అసలు సంబంధమే లేదు’ అని ఆమె ఫైర్ అయ్యారు.

News April 3, 2025

ఏప్రిల్ 3: చరిత్రలో ఈరోజు

image

1955: ప్రముఖ నేపథ్య గాయకుడు హరిహరన్ జననం
1962: నటి జయప్రద జననం
1973: నటుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా జననం
1964: భారత మాజీ క్రికెటర్ అజయ్ శర్మ జననం
1680: మహారాష్ట్ర సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మరణం
1973: కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు ప్రభుదేవా జననం
1973: భారత మాజీ క్రికెటర్ నీలేష్ కులకర్ణి జననం

News April 3, 2025

జైస్వాల్ ముంబైని వీడటానికి కారణం అదేనా?

image

యువ క్రికెటర్ జైస్వాల్ <<15967764>>ముంబైని వీడి గోవా జట్టులో<<>> చేరనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ముంబై టీమ్‌తో ఆయనకు ఏర్పడిన విభేదాలే దీనికి కారణమని తెలుస్తోంది. క్రికెట్ వర్గాల ప్రకారం.. ముంబై-విదర్భ మధ్య జరిగిన రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్‌కి జైస్వాల్ మోకాలి నొప్పి పేరిట దూరమయ్యారు. ఆ మ్యాచ్‌లో ముంబై ఓడింది. దాంతో అసోసియేషన్ పెద్దలకు, జైస్వాల్‌కు మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం.

error: Content is protected !!