News February 27, 2025

RTI ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యవహారాల ఇంచార్జిగా రవి కుమార్

image

సమాచార హక్కు చట్టం ఆక్టీవిస్ట్స్ ఫోరమ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యవహారాల ఇంచార్జి గా గోదావరిఖని కి చెందిన పోగుల రవికుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు బత్తుల గణేశ్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రవికుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసుకుంటూ జిల్లాలో సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలుకు కృషి చేస్తానని చెప్పారు. ఆర్టీఐపై అవగాహన కార్యక్రమాలు చేపడతానని వెల్లడించారు.

Similar News

News February 28, 2025

KNR: గ్రాడ్యుయేట్స్ 64.64 శాతం, టీచర్స్ 89.92 శాతం

image

కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా మొత్తం 46,247 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 64.64 ఓట్ల శాతం నమోదైంది. అలాగే ఉపాధ్యాయ ఎన్నికలో 46,247 మంది ఓటు హక్కు వినియోగించుకోగా పోలింగ్ 89.92 శాతం నమోదైందని ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు.

News February 27, 2025

ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా కలెక్టర్

image

కరీంనగర్‌ ముకరంపూర్‌లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ ఎన్నికల పోలింగ్ స్టేషన్‌లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి క్యూ లైన్‌లో వెళ్లి గ్రాడ్యుయేట్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదే పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ తన గ్రాడ్యుయేట్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

News February 27, 2025

కరీంనగర్‌: ఓటు వేయడానికి ఆమె డల్లాస్ నుంచి వచ్చింది

image

శాసన మండలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గురువారం కరీంనగర్‌లో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించేందుకు దూర్షెడ్ గ్రామానికి చెందిన శ్రీరామోజు అఖిల డల్లాస్ నుంచి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంది. ఓటు హక్కు వినియోగించుకోవడం మనందరి బాధ్యత అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి అని ఆమె తెలిపారు.

error: Content is protected !!