News December 27, 2025
RUB సాధ్యపడదు: MP పెమ్మసాని

గుంటూరు శంకర్ విలాస్లో ROB మాత్రమే నిర్మిస్తున్నామని RUB సాధ్యపడదని MP పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పనులు చేస్తున్నామని చెప్పారు. ముందుగా అనుకున్నట్లే DDR బాండ్లు, ROB నిర్మాణానికి ఖర్చు మొత్తం రూ.150 కోట్ల ఖర్చవుతుందని తెలిపారు. కొందరు కోరుకుంటున్నట్లు ఆర్యూబీ నిర్మాణం చేపడితే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు.
Similar News
News December 27, 2025
GNT: మంత్రి పేరిట మోసం.. రూ.1.15 కోట్లు టోకరా.!

మంత్రి కొల్లు రవీంద్రకు ఏజెంట్లుగా పనిచేస్తున్నాం.. లిక్కర్ మార్ట్ మంజూరు చేయిస్తామంటూ రూ.1.15 కోట్లు వసూలు చేసిన వంకాయలపాటి రాంబాబు, సాయికిరణ్పై అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. SVN కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు నుంచి నిందితులు డబ్బులు తీసుకున్నారు. రోజులు గడుస్తున్నా లిక్కర్ మార్ట్ మంజూరు కాలేదు. బాధితుడు మంత్రిని కలవగా వారు తనకు తెలియదని చెప్పడంతో మోసపోయానని బాధితుడు ఫిర్యాదు చేశాడు.
News December 27, 2025
GNT: నేడు జీఎంసీ కౌన్సిల్ సమావేశం .

గుంటూరు నగరపాలకసంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో శనివారం కౌన్సిల్ సాధారణ సమావేశం జరగనుంది. ఈ మేరకు మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన ఉదయం 10:30 గంటల నుంచి సమావేశం నిర్వహించనున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు ఈ సమావేశానికి హాజరవ్వాలని కమిషనర్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు.
News December 27, 2025
గుంటూరు: ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.5 లక్షలు టోకరా

తాడికొండ పోలీస్ స్టేషన్లో శుక్రవారం చీటింగ్ కేసు నమోదైంది. రావెల గ్రామానికి చెందిన ఫిర్యాదుదారు వీలేటి నాగచైతన్య వివరాల మేరకు.. మైలబత్తుల బాబు మహేష్, బాలరామ్, నందా కలిచ హైదరాబాద్లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని నకిలీ ఆఫర్ లేఖ చూపించి, రూ.5 లక్షలు తీసుకున్నారన్నారు. అనంతరం కంపెనీకి వెళ్లగా, ఆ ఆఫర్ లేఖ నకిలీదని తేలింది. తనకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశానన్నాడు.


