News August 28, 2024

గణేశ్ మండపాలు పెట్టేవారికి రూల్స్(1/2)

image

TG: హైదరాబాద్ పరిధిలో గణేశ్ మండపాల ఏర్పాటుకు పోలీసులు పలు నిబంధనలు విధించారు.
✒ పబ్లిక్ రోడ్లు, కాలిబాట ప్రాంతాల్లో మండపాలు ఏర్పాటుచేయొద్దు.
✒ భక్తుల రద్దీ, గాలి, వానలను తట్టుకునేలా నిర్మాణం ఉండాలి.
✒ రాత్రి 10 తర్వాత లౌడ్ స్పీకర్లు వాడొద్దు. ఇరుగుపొరుగు వారికి, వృద్ధులు/ విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలి.
✒ లక్కీ డిప్‌లు, లాటరీలు, బలవంతపు నగదు సేకరణ చేయరాదు.

Similar News

News November 19, 2025

సిద్దిపేట: పారదర్శకంగా ఇందిరమ్మ చీరల పంపిణీ: కలెక్టర్

image

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ జిల్లాలో పూర్తి పారదర్శకంగా జరిగేలా కృషి చేయాలని కలెక్టర్ హైమావతి సూచించారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, మహిళా సమాఖ్య ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

News November 19, 2025

వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల సూచనలు

image

TG: చలి, పొగమంచు పెరుగుతుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశమున్న నేపథ్యంలో HYD ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు సూచనలు చేశారు. ‘నెమ్మదిగా నడుపుతూ అలర్ట్‌గా ఉండండి. మంచులో హైబీమ్ కాకుండా లోబీమ్ లైటింగ్ వాడండి. ఎదుటి వాహనాలకు సురక్షిత దూరాన్ని మెయిన్‌టైన్ చేయండి. సడెన్‌ బ్రేక్ వేస్తే బండి స్కిడ్ అవుతుంది. మొబైల్ వాడకుండా ఫోకస్డ్‌గా ఉండండి. వాహనం పూర్తి కండిషన్‌లోనే ఉందా అని చెక్ చేసుకోండి’ అని సూచించారు.

News November 19, 2025

దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న PM మోదీ

image

ప్రధాని మోదీ ఈ నెల 21 నుంచి 23 వరకు సౌత్ ఆఫ్రికాలో పర్యటించనున్నారు. 22, 23 తేదీల్లో నిర్వహించనున్న 20వ G-20 సదస్సులో ఆయన పాల్గొంటారని విదేశాంగ శాఖ ప్రకటించింది. ‘G-20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ జొహన్నెస్‌బర్గ్‌లో పర్యటించనున్నారు. ఈ సమ్మిట్‌లో ప్రధాని 3 సెషన్లలో ప్రసంగిస్తారు. వివిధ నేతలతోనూ భేటీ అవుతారు. ఇది ఓ గ్లోబల్ సౌత్ దేశంలో వరుసగా నాలుగోసారి జరుగుతున్న G-20 సదస్సు’ అని పేర్కొంది.