News January 15, 2025

40కి పైగా క్షిపణులు, 70 డ్రోన్లు.. ఉక్రెయిన్‌పై దాడి పెంచిన రష్యా

image

ఉక్రెయిన్‌పై రష్యా మరో భారీ క్షిపణి దాడి చేసింది. 40కి పైగా క్షిపణులు, 70 డ్రోన్లు ఉపయోగించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో ముందస్తు విద్యుత్ కోతలు అమలు చేసినట్టు తెలిపారు. ఉక్రెయిన్ సైన్యానికి యుద్ధంలో ఉప‌క‌రిస్తున్న‌ గ్యాస్, ఎనర్జీ స‌దుపాయాలే ల‌క్ష్యంగా ర‌ష్యా ఈ దాడి చేసింది. కాగా, ఉక్రెయిన్‌కు జర్మనీ మరో 60 Anti-Aircraft Missiles పంప‌నుంది.

Similar News

News November 19, 2025

లక్కీ డిప్‌కు ఎంతమంది సెలెక్ట్ అవుతారు?

image

తిరుమల శ్రీవారి విశేష సేవల కోసం ప్రతి నెలా దాదాపు 4-5 లక్షల మంది భక్తులు లక్కీ డిప్‌కు దరఖాస్తు చేసుకుంటారు. ఇందులో కేవలం 7,500 నుంచి 8,500 మందికి మాత్రమే సేవల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. వీరు శ్రీవారిని తొలి గడప నుంచి అతి దగ్గరగా దర్శించుకునే అదృష్టాన్ని పొందుతారు. లక్కీ డిప్‌లో ఎంపిక కానివారు, శ్రీవాణి ట్రస్ట్‌కు ₹10 వేలు విరాళం ఇచ్చి కూడా మొదటి గడప దర్శనం ద్వారా శ్రీవారిని వీక్షించవచ్చు.

News November 19, 2025

BOBలో 82 పోస్టులకు నోటిఫికేషన్

image

బ్యాంక్ ఆఫ్ బరోడా(<>BOB<<>>) రిసీవబుల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో 82 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి డిసెంబర్ 9 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, SC, ST, PwBD, మహిళలకు రూ.175. వెబ్‌సైట్: https://bankofbaroda.bank.in/

News November 19, 2025

మల్లె కొమ్మ కత్తిరింపులు.. ఈ జాగ్రత్తలతో మేలు

image

మంచి దిగుబడికి మల్లె తోటల పెంపకంలో మొదటి కత్తిరింపు పంట నాటిన ఏడాదికి చేయాలి. ఏటా నవంబర్-డిసెంబర్‌లో పొదను కత్తిరించాలి. కొమ్మలను కత్తిరించడానికి 10 -15 రోజుల ముందు నుంచి నీరు కట్టడం ఆపేయాలి. నవంబర్ చివరి నుంచి జనవరి తొలివారం వరకు కత్తిరింపులు చేస్తే మార్చి నుంచి జులై వరకు పూలు వస్తాయి. ఇలా చేయడం వల్ల మల్లె మొక్కలన్నీ ఒకేసారి పూతకురావు. రైతు ఎక్కువ రోజులు మల్లెను మార్కెటింగ్ చేసి లాభం పొందవచ్చు.