News March 23, 2024
రష్యా ఉగ్రదాడి.. 150కి చేరిన మృతుల సంఖ్య

రష్యా రాజధాని మాస్కోలోని క్రోకస్ సిటీ హాల్లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 150 మంది చనిపోయారు. మరికొంత మంది ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. కాగా ఇప్పటికే 11 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. నిందితులకు ఉక్రెయిన్తో సంబంధం ఉందని అందుకే వారు ఆ దేశంలోకి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారని రష్యా సెక్యూరిటీ సర్వీస్ పేర్కొంది.
Similar News
News November 13, 2025
బిహార్లో SIRపై ఒక్క అప్పీల్ కూడా రాలేదు: EC

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 67.13% పోలింగ్ నమోదైనట్లు EC అధికారికంగా ప్రకటించింది. 1951 నుంచి ఇదే అత్యధికమని తెలిపింది. 38 జిల్లాల్లో ఎక్కడా రీపోల్ కోసం అప్పీల్స్ రాలేదని తెలిపింది. 7,45,26,858 మంది ఓటర్లతో తుది జాబితా రిలీజ్ చేశామని, ఎక్కడా SIRపై అప్పీల్ చేయలేదని వెల్లడించింది. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుందని చెప్పింది. ఇందుకోసం 4,372 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.
News November 13, 2025
ఇతిహాసాలు క్విజ్ – 65 సమాధానాలు

ప్రశ్న: దేవవ్రతుడు ఎవరు? ఆయన ఏమని ప్రతిజ్ఞ చేశాడు? ఆ ప్రతిజ్ఞ ఎందుకు చేయాల్సి వచ్చింది?
శంతనుడు, గంగాదేవి ఎనిమిదవ కుమారుడు ‘దేవవత్రుడు’. హస్తినాపురానికి రాజుగా కాబోనని, ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని భయంకరమైన ప్రతిజ్ఞ చేసినందుకు ఆయనకు ‘భీష్ముడు’ అనే పేరు వచ్చింది. శంతనుడి సంతోషం కోసం, తన తండ్రి పెళ్లి చేసుకొనే సత్యవతి పుత్రులకు రాజ్యాధికారం దక్కాలని భీష్ముడు ఈ ప్రతిజ్ఞ చేశాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 13, 2025
కొండా సురేఖ క్షమాపణలు.. కేసు విత్డ్రా చేసుకున్న నాగార్జున

TG: మంత్రి కొండా సురేఖ <<18263475>>క్షమాపణలు<<>> చెప్పడంతో సీనియర్ హీరో నాగార్జున పరువునష్టం కేసును విత్డ్రా చేసుకున్నారు. దీంతో నాంపల్లి కోర్టు ఆ కేసును కొట్టివేసింది. కాగా నిన్న కొండా సురేఖ నాగార్జునకు ట్విటర్ (X) వేదికగా క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. సమంత విడాకుల విషయంలో మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు గతంలో సంచలనం రేపాయి. దీంతో నాగార్జున ఆమెపై పరువునష్టం దావా వేశారు.


