News March 21, 2024
5 ఎకరాల వరకు రైతుబంధు రేపు పూర్తి: మంత్రి పొంగులేటి

TG: ధరణి పోర్టల్ను ప్రక్షాళన చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 5 ఎకరాల వరకు రైతుబంధు నగదు జమ రేపు పూర్తి చేస్తామని చెప్పారు. తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. మేడిగడ్డ అవినీతిలో బాధ్యులను వదలమని హెచ్చరించారు. రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేస్తామన్నారు.
Similar News
News October 14, 2025
బనకచర్లను ఆపండి… CWCకి తెలంగాణ లేఖ

ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టును ఆపాలని తెలంగాణ ప్రభుత్వం CWC, పోలవరం అథారిటీకి లేఖ రాసింది. ఈ లేఖలో పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. టెండర్లు, సర్వేను తక్షణమే ఆపాలని కోరింది. ఆ ప్రాజెక్టును ఆమోదించవద్దని, పోలవరం DPRకు విరుద్ధంగా ఉందని లేఖలో వెల్లడించింది.
News October 14, 2025
ALERT: రేపు భారీ వర్షాలు

AP: రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతిలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరులోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News October 14, 2025
స్వదేశీ యాప్స్పై పెరుగుతున్న మోజు!

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వీడియో తర్వాత స్వదేశీ మ్యాప్స్ యాప్ ‘MapmyIndia’ ఇన్స్టాల్స్ భారీగా పెరిగాయి. 1995లో భారతీయ జంట రాకేశ్, రష్మీ వర్మ రూపొందించిన ఈ యాప్, Google Maps కంటే ముందే సేవలు అందిస్తోంది. ఇందులో ఉండే 3D జంక్షన్ వ్యూ ద్వారా సంక్లిష్ట జంక్షన్లలో దారి సులభమవుతుంది. గుంతలు, స్పీడ్ బ్రేకర్లపై హెచ్చరికలు, లైవ్ సిగ్నల్ కౌంట్డౌన్ వంటి ఫీచర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.