News August 26, 2025
సాదియా అంకితభావం యువతకు స్ఫూర్తి: లోకేశ్

AP: IPF వరల్డ్ క్లాసిక్ సబ్ జూనియర్, జూనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మంగళగిరికి చెందిన సాదియా అల్మాస్ కాంస్య పతకం సాధించారు. ఆమెకు మంత్రి లోకేశ్ అభినందనలు తెలిపారు. ‘అంతర్జాతీయ వేదికపై భారత జెండాను రెపరెపలాడించారు. దేశంతో పాటు మన మంగళగిరికి గర్వకారణంగా నిలిచారు. ఆమె అంకితభావం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది. అన్ని విధాలా ప్రోత్సహిస్తాం. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలి’ అని ఆకాంక్షించారు.
Similar News
News August 26, 2025
OP సిందూర్ ముగియలేదు: రాజ్నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని, విరామం ఇచ్చామని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. వైజాగ్లో ఉదయగిరి, హిమగిరి వార్ షిప్లను మంత్రి జాతికి అంకితమిచ్చారు. ‘2050 నాటికి దేశంలో 200 యుద్ధ నౌకలు నిర్మించనున్నాం. వేర్వేరు చోట్ల రూపొందించిన రెండు యుద్ధ నౌకలను ఒకేసారి జలప్రవేశం చేయించడం ఇదే తొలిసారి. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ నౌకలు మన దేశ ప్రతీకగా నిలుస్తున్నాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News August 26, 2025
సెంచరీలు కొట్టే సత్తా మాది!

బుచ్చిబాబు టోర్నమెంట్లో యంగ్ క్రికెటర్లు రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్ సెంచరీలతో రాణించారు. హరియాణాతో మ్యాచులో సర్ఫరాజ్ (ముంబై) సెంచరీ చేయగా, హిమాచల్ప్రదేశ్తో మ్యాచులో రుతురాజ్ (మహారాష్ట్ర) శతకం బాదారు. గైక్వాడ్ ఒకే ఓవర్లో 4 సిక్సులు బాదడం విశేషం. కాగా ఈ టోర్నీలో సర్ఫరాజ్కు ఇది రెండో సెంచరీ. కొంతకాలంగా జాతీయ జట్టులో చోటు దక్కని వీరిద్దరికీ రాబోయే రోజుల్లోనైనా అవకాశం లభిస్తుందేమో చూడాలి.
News August 26, 2025
ట్రంప్ కాల్స్ను మోదీ పట్టించుకోలేదు: జర్మనీ మీడియా

సుంకాల విషయంలో ట్రంప్ ఒత్తిళ్లకు భారత ప్రధాని మోదీ తలొగ్గలేదని జర్మనీ మీడియా సంస్థ FAZ తెలిపింది. ‘గత కొన్ని వారాల్లో సుంకాల విషయంలో ట్రంప్ చాలా సార్లు మోదీకి ఫోన్ కాల్ చేశారు. కానీ వాటిని ఆయన పట్టించుకోలేదు. కాల్స్కు సమాధానం ఇవ్వలేదు. టారిఫ్స్ పేరు చెప్పి ట్రంప్ మిగతా దేశాలను ఓడించారు కానీ ఇండియాను ఏమీ చేయలేకపోయారు’ అని పేర్కొంది. ఈ వార్తను భారత ప్రభుత్వం ధ్రువీకరించాల్సి ఉంది.