News November 25, 2024

శబరిమలకు 9రోజుల్లోనే రూ.41.64కోట్ల ఆదాయం

image

శబరిమల ఆలయాన్ని తెరిచిన 9 రోజుల్లోనే 6.12లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. దీంతో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డుకు రూ.41.64కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాది ఇదే సీజన్లో ఆదాయం రూ.13.37కోట్లుగా ఉంది. భక్తులకు ఇబ్బందుల్లేకుండా సన్నిధానం, పంపా, నీలక్కల్ కొండ ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ సరఫరా కోసం అధికారులు చర్యలు తీసుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి.

Similar News

News November 7, 2025

చీమలంటే భయం.. అసలేంటీ మైర్మెకోఫోబియా?

image

మైర్మెకోఫోబియా గ్రీకు పదాలు మైర్మెక్స్(చీమ)+ ఫోబోస్(భయం) నుంచి వచ్చింది. ఈ ఫోబియా గలవారు చీమలతో ప్రమాదం, నష్టమని ఆందోళన చెందుతారు. వారికి చీమలంటే అసహ్యం, భయం. ఈ భయం పెరిగితే చీమలను చూస్తే పానిక్ అటాక్ రావొచ్చు. దీనికి కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ, హిప్నోథెరపీ, ఎక్స్‌పోజర్ థెరపీల చికిత్సతో తగ్గించవచ్చు. ఈ భయంతో సంగారెడ్డి (TG) జిల్లా అమీన్‌పూర్‌లో మనీషా నిన్న ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే.

News November 7, 2025

నరసాపురం వరకు వందేభారత్ రైలు

image

AP: చెన్నై సెంట్రల్- విజయవాడ మధ్య నడుస్తున్న వందేభారత్ రైలు(20677/20678)ను నరసాపురం వరకు పొడిగిస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం ఈ రైలు 5.30AMకు చెన్నైలో బయలుదేరి రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి మీదుగా విజయవాడకు చేరుతోంది. ఇకపై అక్కడి నుంచి గుడివాడ, భీమవరం మీదుగా నరసాపురానికి 2.10PMకు చేరుకుంటుంది. తిరిగి అక్కడ 3.20PMకు బయలుదేరి 11.45PMకు చెన్నైకి వెళ్తుంది.

News November 7, 2025

తక్కువ పంటకాలం – రబీకి అనువైన వరి రకాలు

image

రబీ సాగుకు తక్కువ కాలపరిమితి, తెగుళ్లను తట్టుకునే వరి రకాలను సాగు చేసుకోవాలి. అందులో కొన్ని M.T.U 1010(కాటన్ దొర సన్నాలు), M.T.U 1156( తరంగిణి), M.T.U 1153(చంద్ర), M.T.U 1293, M.T.U 1273, M.T.U 1290. వీటి పంటకాలం 120 రోజులు. వీటిలో కొన్ని పొడుగు సన్నగింజ రకాలు. దిగుబడి ఎకరాకు 3-3.2 టన్నులు. చేనుపై పడిపోవు. అగ్గితెగులును తట్టుకుంటాయి.✍️ మరిన్ని వరి రకాలు, పాడి సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.