News July 31, 2024
మోసానికి ప్రతిరూపం సబిత: మీడియా చిట్చాట్లో రేవంత్

TG: సబితా ఇంద్రారెడ్డి తనను కాంగ్రెస్లోకి రమ్మని, తర్వాత ఆమె బీఆర్ఎస్లోకి మారారని మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ అన్నారు. ఆమె మోసానికి ప్రతిరూపం అని వ్యాఖ్యానించారు. ‘నేను సభలో సబిత పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. ఆమె ఆవేదనలో అర్థం లేదు. ఆమె మీద ఏ మాత్రం అభిమానం ఉన్నా కేసీఆర్ సభకు రావాలి’ అని పేర్కొన్నారు. సభలో BRS సభ్యులకు ఇవ్వాల్సిన సమయం ఇచ్చామని తెలిపారు.
Similar News
News October 27, 2025
అన్నదాత సుఖీభవ.. ఆ రైతులకు గుడ్ న్యూస్

AP: వెబ్ల్యాండ్ రికార్డుల్లో ఆధార్ తప్పుల వల్ల ‘అన్నదాత సుఖీభవ’ పథకం 5.44L మంది రైతులకు ఆగిపోయింది. వీటిలో ప్రతి సవరణకు మీ సేవా కేంద్రాల్లో రూ.50 ఛార్జ్ ఉంది. అయితే పథకం ఆగిపోయిన అన్నదాతలంతా ఒకసారి ఉచితంగా సవరణ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందుకోసం మీసేవా ఛార్జీలు రూ.2.72 కోట్లను మాఫీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది.
* రోజూ రైతులకు సంబంధించిన సమాచారం కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News October 27, 2025
దేశంలోనే మొట్టమొదటి మహిళా అశ్విక దళం

హైదరాబాద్ పోలీసులు దేశంలోనే మొట్టమొదటి మహిళా అశ్విక దళాన్ని ఏర్పాటు చేశారు. గుర్రపుస్వారీలో శిక్షణపొంది, మెరికల్లా తయారై సిటీమౌంటెడ్ పోలీస్ విభాగంలో భాగమయ్యారు 9మంది మహిళా కానిస్టేబుళ్లు. వీరంతా 2024 ఆర్డ్మ్ రిజర్వ్ బ్యాచ్కి చెందిన వాళ్లు. వీరికి గుర్రపుస్వారీలో 6నెలల పాటు శిక్షణ ఇప్పించి విధులను అప్పగించారు. మంచి శిక్షణ ఇస్తే తామూ ఎందులోనూ తీసిపోమని ప్రత్యక్షంగా నిరూపిస్తున్నారీ నారీమణులు.
News October 27, 2025
పోలింగ్లో పైచేయి… అయినా గెలిచేది తక్కువే…

BIHAR ఎన్నికల్లో పురుషుల కన్నా మహిళల ఓటింగ్ శాతమే ఎక్కువ. అయితేనేం పోటీలో ఉండే స్త్రీలు గెలిచేది మాత్రం చాలా స్వల్పం. అంటే వారి ఓట్లు పురుష అభ్యర్థులకే ఎక్కువ పడుతున్నాయన్న మాట. స్త్రీకి స్త్రీయే శత్రువంటే ఇదేనేమో. 2005లో 24(234మందికి), 2010లో 34(307), 2020లో 26(370) మంది మాత్రమే గెలిచారు. 2020లో పోలింగ్ శాతం ఉమెన్ 59.69%, మెన్ 54.45%గా ఉంది. 2015లో అత్యధికంగా 60.48% స్త్రీల ఓట్లు పోలయ్యాయి.


