News August 23, 2024

SAD: బస్సు ప్రమాదంలో 27 మంది మృతి

image

నేపాల్‌లోని మర్స్యంగ్డి నదిలో బస్సు పడిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 27కి చేరింది. ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు సిబ్బందితో సహా మొత్తం 43 మంది ఉన్నట్లు స్థానిక అధికారులు ధ్రువీకరించారు. కాగా ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఈ బస్సు 8 రోజులు నేపాల్‌లో ఉండేందుకు అనుమతి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ప్రయాణికులంతా మహారాష్ట్రకు చెందినవారేనని తెలుస్తోంది.

Similar News

News November 14, 2025

CII: 2 రోజుల్లోనే ₹7.15 లక్షల కోట్ల పెట్టుబడులు

image

AP: విశాఖలో నిర్వహిస్తున్న CII సదస్సు మంచి ఫలితాలిస్తోంది. నిన్న, ఇవాళ కలిపి ₹7,14,780 CR పెట్టుబడులపై 75 MOUలు జరిగాయి. వీటి ద్వారా 5,42,361 ఉద్యోగాలు రానున్నాయని ప్రభుత్వం ప్రకటించింది.
* తొలి రోజు సదస్సులో మొత్తంగా 40 కంపెనీలతో ₹3,49,476 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. వీటి ద్వారా 4,15,890 ఉద్యోగాలు వచ్చే అవకాశం.
* నిన్న 35 ఒప్పందాల ద్వారా ₹3,65,304 కోట్ల పెట్టుబడులు. వీటితో 1,26,471 ఉద్యోగాలు.

News November 14, 2025

బిహార్ ప్రజలు రికార్డులు బద్దలుకొట్టారు: మోదీ

image

బిహార్ ప్రజలు వికసిత్ భారత్ కోసం ఓటేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘బిహార్‌లో NDA సాధించింది అతి పెద్ద విజయం. రికార్డుస్థాయిలో ఎన్నికల్లో పాల్గొనాలని నేను ఓటర్లను కోరాను. వాళ్లు రికార్డులు బద్దలుకొట్టారు. మేం ప్రజలకు సేవకులం. వారి మనసులు గెలుచుకున్నాం. బిహార్‌లో ఆటవిక రాజ్యం ఎప్పటికీ తిరిగిరాదు. కొందరు MY ఫార్ములాతో గెలవాలని చూశారు. మా ‘MY’ ఫార్ములా అంటే మహిళ, యూత్ ఫార్ములా’ అని తెలిపారు.

News November 14, 2025

60 పోస్టులకు TSLPRB నోటిఫికేషన్

image

తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(TSLPRB) 60 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్ పోస్టులున్నాయి. అభ్యర్థులు ఈ నెల 27 ఉ.8 గంటల నుంచి డిసెంబర్ 15 సా. 5 గంటల వరకు <>వెబ్‌సైట్‌లో<<>> దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అర్హతలతో పాటు పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపింది.