News October 3, 2024

సద్గురు పాదం ఫొటో ఒక్కోటి ₹3,200.. నెటిజన్ల ఫైర్

image

సద్గురు జ‌గ్గీ వాసుదేవ్ పాదాల ఫొటో ఒక్కోటి ₹3,200కి ఈషా ఫౌండేష‌న్ వెబ్‌సైట్‌లో విక్ర‌యానికి ఉంచడంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. స‌ద్గురు పాదాల ఫొటో కోసం రూ.3,200 చెల్లించ‌డానికి మీ జీవితంలో ఏం త‌ప్పు జ‌ర‌గాల్సి ఉందంటూ ఒకరూ, మోడ్ర‌న్ బాబాలు ధ‌ర్మాన్ని మార్కెట్‌లో వ‌స్తువులా మార్చేశార‌ని మరొకరు విమ‌ర్శిస్తున్నారు. ఇదొక మోడ్రన్ చర్య అని, ఫొటోపై రివ్యూలు కూడా ఇస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు.

Similar News

News December 15, 2025

మెస్సీ టూర్ గందరగోళం.. కలకత్తా హైకోర్టులో PIL

image

ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీ టూర్ సందర్భంగా కోల్‌కతా స్టేడియంలో ఏర్పడిన గందరగోళంపై హైకోర్టులో PILలు దాఖలయ్యాయి. వీటిని స్వీకరించిన కోర్టు వచ్చేవారం విచారిస్తామని పేర్కొంది. LOP సువేందు అధికారి తదితరులు వీటిని దాఖలు చేశారు. నిష్పాక్షిక దర్యాప్తుకోసం CBI, ED, SFIOతో విచారించాలని కోరారు. కాగా మిస్‌మేనేజ్మెంటు, స్టేడియంలో విధ్వంసం ఘటనలపై CM మమత రాష్ట్ర ప్రభుత్వ కమిటీతో విచారణకు ఆదేశించడం తెలిసిందే.

News December 15, 2025

యూరియా బుకింగ్ కోసం యాప్: తుమ్మల

image

TG: యాసంగికి సరిపడా యూరియా అందుబాటులో ఉంచుతామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులు బారులు తీరాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకునేందుకు త్వరలో మొబైల్ యాప్ విడుదల చేస్తామన్నారు. కాగా ఇప్పటికే 2.48 లక్షల టన్నుల ఎరువులు రాష్ట్రంలో అందుబాటులో ఉండగా.. డిసెంబర్‌కు కేటాయించిన యూరియా కూడా చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

News December 15, 2025

ఇంధన ధరల్లో తేడాకు అవే కారణం: కేంద్రం

image

ఢిల్లీ, ముంబైతో పోలిస్తే ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటంపై రాజ్యసభలో కేంద్ర మంత్రి సురేశ్ గోపీ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ‘అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.74, అండమాన్&నికోబార్‌లో రూ.82.46గా ఉంది. రవాణా ఖర్చులు, ఆయా రాష్ట్ర/UT ప్రభుత్వాలు విధించే VAT (వాల్యూ యాడెడ్ ట్యాక్స్)లో తేడాలే ఇందుకు కారణం’ అని తెలిపారు. ఏపీలో లీటర్ పెట్రోల్ పై VAT రూ.21.90, అండమాన్‌లో రూ.0.82గా ఉంది.