News October 3, 2024
సద్గురు పాదం ఫొటో ఒక్కోటి ₹3,200.. నెటిజన్ల ఫైర్

సద్గురు జగ్గీ వాసుదేవ్ పాదాల ఫొటో ఒక్కోటి ₹3,200కి ఈషా ఫౌండేషన్ వెబ్సైట్లో విక్రయానికి ఉంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సద్గురు పాదాల ఫొటో కోసం రూ.3,200 చెల్లించడానికి మీ జీవితంలో ఏం తప్పు జరగాల్సి ఉందంటూ ఒకరూ, మోడ్రన్ బాబాలు ధర్మాన్ని మార్కెట్లో వస్తువులా మార్చేశారని మరొకరు విమర్శిస్తున్నారు. ఇదొక మోడ్రన్ చర్య అని, ఫొటోపై రివ్యూలు కూడా ఇస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు.
Similar News
News December 13, 2025
ఏపీలోనూ సర్పంచ్ ఎన్నికలు.. ఏర్పాట్లపై SEC ఆరా

APలోనూ స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. పదవీకాలం ముగుస్తున్న పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు ముందస్తు కార్యక్రమాలపై SEC నీలం సాహ్ని ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. సన్నాహాలు ఎలా జరుగుతున్నాయని ఆరా తీశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పదవీకాలం మార్చితో, సర్పంచ్ల పదవీకాలం ఏప్రిల్తో ముగియనుంది. కాగా TGలో ప్రస్తుతం స్థానిక ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.
News December 13, 2025
ఆశపడి వెల్లుల్లితిన్నా రోగం అట్లాగే ఉందట

వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదని, కొన్ని రోగాలను నయం చేస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే ఆ ఘాటును భరించి తిన్నా ఎలాంటి మార్పు లేకపోతే నిరాశే ఎదురవుతుంది. అలాగే ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఎంతో ప్రయాసపడి, కష్టపడి ప్రయత్నించినప్పటికీ, చివరికి ఫలితం శూన్యమైనప్పుడు లేదా పరిస్థితిలో పురోగతి లేనప్పుడు ఈ సామెతను సందర్భోచితంగా వాడతారు.
News December 13, 2025
బలి ‘గుమ్మడికాయ’తో ఇద్దామా?

అమ్మవార్లకు చాలామంది కోడి, మేకలను బలి ఇస్తారు. అయితే ఈ జంతు బలి కంటే కూడా గుమ్మడికాయ బలితోనే అమ్మవారు ఎక్కువ సంతోషిస్తారని పండితులు చెబుతున్నారు. కూష్మాండాన్ని శిరస్సుకు ప్రతీకగా భావించి అమ్మవారికి దీన్ని సమర్పించాలని మన శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ విధానమే శ్రేయస్కరమని చెబుతున్నాయి. అందుకే దసరాకి కూష్మాండాన్నే బలిస్తారు. ఇది హింస లేని, దైవ ప్రీతి కలిగించే ఉత్తమ మార్గం.


