News October 3, 2024
సద్గురు పాదం ఫొటో ఒక్కోటి ₹3,200.. నెటిజన్ల ఫైర్

సద్గురు జగ్గీ వాసుదేవ్ పాదాల ఫొటో ఒక్కోటి ₹3,200కి ఈషా ఫౌండేషన్ వెబ్సైట్లో విక్రయానికి ఉంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సద్గురు పాదాల ఫొటో కోసం రూ.3,200 చెల్లించడానికి మీ జీవితంలో ఏం తప్పు జరగాల్సి ఉందంటూ ఒకరూ, మోడ్రన్ బాబాలు ధర్మాన్ని మార్కెట్లో వస్తువులా మార్చేశారని మరొకరు విమర్శిస్తున్నారు. ఇదొక మోడ్రన్ చర్య అని, ఫొటోపై రివ్యూలు కూడా ఇస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు.
Similar News
News April 4, 2026
టాపర్ల వలస: చదివేది ఇక్కడ.. బతికేది విదేశాల్లో!

దేశంలో మేధో వలస ఆందోళన కలిగిస్తోంది. 1990-2020 మధ్య 31 మంది JEE టాపర్లలో 74%(23 మంది) ఫారిన్ వెళ్లిపోయారు. మరో ఐదుగురు ఇక్కడే ఉంటూ విదేశీ కంపెనీలకు పని చేస్తున్నారు. వీళ్లే కాదు ఏటా లక్షల మంది స్టూడెంట్లు విదేశాలకు వెళ్తున్నారు. 2021-22లో 46,878 మంది చదువులకు ఇండియాకొస్తే, 11.59 లక్షల మంది మన వాళ్లు అబ్రాడ్ వెళ్లారు. 2024 నాటికి ఇది 13.36 లక్షలకు పెరిగింది. స్టడీస్ అయ్యాక అక్కడే సెటిలవుతున్నారు.
News April 4, 2026
EC అండతో BJP ఎన్నికల అక్రమాలు: సిబల్

EC, BJPపై MP కపిల్ సిబల్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ‘WB ఎన్నికల్లో తమకు ఓటు వేసేందుకు BJP బిహార్ ఓటర్లను తరలిస్తోంది. వీరికి 2 చోట్లా ఓట్లున్నాయి. బిహార్ ఎన్నికల్లోనూ హరియాణా వారితో ఓట్లేయించారు. దానికోసం రైళ్లు నడిపారు. ఛత్పూజ కోసం అని రైల్వే బుకాయించింది కానీ అది నిజం కాదు. EC అండగా ఉండబట్టే BJP ఆత్మనిర్భరత అంటోంది’ అని 2చోట్లా ఓట్లున్న వారి వివరాలు బయటపెట్టారు. BJPపై మమత ఇలాంటి ఆరోపణే చేశారు.
News April 4, 2026
EC అండతో BJP ఎన్నికల అక్రమాలు: సిబల్

EC, BJPపై MP కపిల్ సిబల్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ‘WB ఎన్నికల్లో తమకు ఓటు వేసేందుకు BJP బిహార్ ఓటర్లను తరలిస్తోంది. వీరికి 2 చోట్లా ఓట్లున్నాయి. బిహార్ ఎన్నికల్లోనూ హరియాణా వారితో ఓట్లేయించారు. దానికోసం రైళ్లు నడిపారు. ఛత్పూజ కోసం అని రైల్వే బుకాయించింది కానీ అది నిజం కాదు. EC అండగా ఉండబట్టే BJP ఆత్మనిర్భరత అంటోంది’ అని 2చోట్లా ఓట్లున్న వారి వివరాలు బయటపెట్టారు. BJPపై మమత ఇలాంటి ఆరోపణే చేశారు.


