News September 28, 2025

పాపం.. రెండేళ్ల పిల్లాడూ చనిపోయాడు!

image

విజయ్ రోడ్ షోలో జరిగిన తొక్కిసలాటలో లోకం తెలియని చిన్నారులు కూడా ప్రాణాలు వదలడం కన్నీళ్లు పెట్టిస్తోంది. తమ అభిమాన నటుడు, నాయకుడిని చూసేందుకు తల్లిదండ్రులు పిల్లలను తీసుకొచ్చారు. రెండేళ్ల దురు విష్ణు అనే బాలుడి నుదుటికి TVK కండువా చుట్టి సంబరపడ్డారు. కానీ తొక్కిసలాట రూపంలో వచ్చిన మృత్యువు ఆ పిల్లాడిని బలి తీసుకుంది. ఈ దుర్ఘటనలో మొత్తం 10 మంది మైనర్లు చనిపోయారు. మృతుల్లో పిన్న వయస్కుడు విష్ణునే.

Similar News

News February 9, 2026

రూ.20కే గోధుమ పిండి.. పంపిణీ షురూ

image

AP: రేషన్ కార్డుదారులకు రూ.20కే కేజీ గోధుమ పిండి అందించే కార్యక్రమాన్ని మంత్రి మనోహర్ నిన్న తెనాలిలో ప్రారంభించారు. ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లో 1,800 టన్నుల గోధుమ పిండి పంపిణీ చేస్తున్నామని, రానున్న రోజుల్లో అన్ని చోట్లా ఇస్తామని చెప్పారు. స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా నెలలో 15 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు సరకులు తీసుకోవచ్చని తెలిపారు.

News February 9, 2026

ఆకాశంలో టాక్సీలు.. బిల్డింగ్‌లపైనే ల్యాండింగ్: CII ప్రతిపాదన

image

గురుగ్రామ్, నోయిడా ఎయిర్‌పోర్ట్ మధ్య ‘ఎయిర్ టాక్సీలు’ నడపాలని CII ప్రతిపాదించింది. గంటల ప్రయాణం నిమిషాల్లోనే ముగిసేలా ఆఫీసులు, హాస్పిటల్స్, కమర్షియల్ బిల్డింగ్‌లపైనే ల్యాండింగ్ ప్యాడ్లు ఏర్పాటు చేయనున్నారు. ఫస్ట్ ఫేజ్‌లో ఆర్గాన్ ట్రాన్స్‌పోర్ట్ కోసం వీటిని వాడతారట. మెట్రో స్టేషన్లు, బిజినెస్ హబ్‌లను కలుపుతూ ఈ నెట్‌వర్క్ రాబోతోంది.

News February 9, 2026

పిల్లల్లో ఆకలి ఎందుకు తగ్గుతుందంటే?

image

పిల్లల్లో వయసుకు తగిన ఎదుగుదల లేకపోవడం, పాలు ఎక్కువగా తాగడం, చిరుతిళ్లు తినడం, నులిపురుగులు, ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఆకలి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు మంచి పౌష్టికాహారం, పండ్లు, సూప్స్‌ పెట్టాలి. జంక్‌ ఫుడ్‌ చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తే ఊబకాయం, అనారోగ్యాలు వస్తాయి. ఫోన్లు, టీవీ చూపించి అన్నం పెట్టొద్దు. దీనితో అర్టిజం, హైపర్‌ యాక్టివ్‌ సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.