News August 17, 2024
ఆస్పత్రుల్లో సురక్షిత పని వాతావరణం: హోంమంత్రి అనిత

AP: కోల్కతాలో జూనియర్ డాక్టర్పై హత్యాచారం ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆస్పత్రుల్లో సురక్షిత పని వాతావరణం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది భద్రత కోసం ఔట్పోస్టుల వద్ద భద్రతను పెంచాలని నిర్ణయించింది. ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. వైద్యులు, సిబ్బందిపై దాడి జరిగితే వెంటనే కేసు నమోదు చేస్తామని వెల్లడించారు.
Similar News
News January 6, 2026
విజయ్కు కొత్త చిక్కులు

తమిళ స్టార్ హీరో విజయ్కు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఆయన చివరి సినిమాగా పేర్కొంటున్న ‘జన నాయకుడు’ ఈ నెల 9న రిలీజ్ కావాల్సి ఉండగా ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ రాలేదు. దీనిపై మూవీ టీమ్ కోర్టును ఆశ్రయించగా రేపు విచారణ జరగనుంది. మరోవైపు టీవీకే పార్టీ మీటింగ్ ర్యాలీలో <<18778497>>తొక్కిసలాట<<>> ఘటన కేసు CBIకి చేరింది. దీనిపై ఈ నెల 12న ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని ఆయనకు ఆదేశాలు జారీ చేసింది.
News January 6, 2026
ఇతిహాసాలు క్విజ్ – 119 సమాధానం

ప్రశ్న: రామాయణంలో ఏ 2 విష్ణు అవతారాలు పరస్పరం ఎదురుపడ్డాయి? ఆ సందర్భం ఏంటి?
జవాబు: రామాయణంలో రాముడు, పరశురాముడు ఎదురుపడతారు. సీతాకళ్యాణం ముగించుకుని అయోధ్యకు వెళ్లేటప్పుడు శివధనుస్సు విరిచిన రాముడిని ఎదుర్కునేందుకు పరశురాముడు వస్తాడు. రాముడిలోని దైవాన్ని గుర్తించి తన అవతార సమాప్తిని ప్రకటించి తపస్సుకి వెళ్లిపోతాడు. ఇది ఒకేసారి 2 విష్ణు అవతారాలు కలిసిన అరుదైన సందర్భం. <<-se>>#Ithihasaluquiz<<>>
News January 6, 2026
కంది పంట కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కంది పంటలో 80% కాయలు పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాతే కోయాలి. పంట కోతకు 3-4 రోజుల ముందు లీటర్ నీటికి ఇమామెక్టిన్ బెంజోయెట్ 0.4 గ్రా. కలిపి పిచికారీ చేస్తే పంట నిల్వ సమయంలో పెంకు పురుగు ఆశించకుండా కాపాడవచ్చు. నూర్పిడి చేసిన గింజలను బాగా శుభ్రపరిచి చెత్త, ఎండిన ఆకులు, మట్టి మొదలగునవి లేకుండా చేసి 3-4 రోజుల వరకు ఎండబెట్టాలి. గింజలలో 9-10 శాతం తేమ ఉండేటట్లుగా చూసుకోని నిల్వ చేయాలి.


