News June 16, 2024

పవన్‌కు సాయి దుర్గ తేజ్ సర్ప్రైజ్ గిఫ్ట్!

image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఆయన మేనల్లుడు సాయి దుర్గ తేజ్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. స్టార్ వార్స్ లెగో సెట్‌ను ఆయనకు కానుకగా అందించారు. మరోవైపు పవన్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో సాయి తేజ్ నిన్న తిరుమల శ్రీవారి మెట్లు ఎక్కి మొక్కు తీర్చుకున్నారు. కాగా పవన్‌కు చిరంజీవి భార్య సురేఖ కూడా ఓ పెన్నును బహుమతిగా ఇచ్చారు. దాని విలువ ఏకంగా రూ.2.50 లక్షలు అని టాక్.

Similar News

News March 31, 2026

స్పామ్ కాల్స్‌ను అడ్డుకోండిలా!

image

స్పామ్ కాల్స్‌, SMSలతో విసిగిపోయారా? వాటికి చెక్ పెట్టేందుకు ట్రాయ్ DND యాప్‌ ఉపయోగపడుతుంది. ఈ యాప్‌లో మీ నంబర్‌ను రిజిస్టర్ చేసుకుంటే ఇలాంటి కాల్స్‌ను బ్లాక్ చేయవచ్చు. ఏయే ప్రమోషనల్ మెసేజ్‌లు రావాలో ఎంచుకోవచ్చు. స్పామ్ కాల్స్ వస్తే వెంటనే ఫిర్యాదు చేసి, ట్రాక్ చేయొచ్చు. 2025లో ఇలాంటి 1,84,482 స్పామ్ కాల్స్‌ను ట్రాయ్ తొలగించింది. ఈ <>లింక్‌<<>>పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి.

News March 31, 2026

మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర మరోసారి పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,030 పెరిగి రూ.1,49,290గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.950 ఎగబాకి రూ.1,36,850 పలుకుతోంది. ఇక వెండి ధర కేజీపై రూ.5వేలు తగ్గి రూ.2,50,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లోని ధరల్లో స్వల్ప తేడాలుంటాయి

News March 31, 2026

హార్ముజ్‌పై బిల్లుకు ఇరాన్ పార్లమెంటు ఆమోదం

image

హార్ముజ్ మీదుగా వెళ్లే నౌకలపై ఛార్జీలు విధించాలన్న ప్రతిపాదనకు ఇరాన్ పార్లమెంటు ఆమోదం తెలిపినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్‌ నౌకలకు నిషేధం విధించిందని.. ఆంక్షలు విధించే ఇతర దేశాలకూ ఇది వర్తించనున్నట్లు పేర్కొంది. అయితే ఎంత చెల్లించాలి? ఇండియా ఈ లిస్ట్‌లో ఉందా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా భారత నౌకలకు ఇరాన్ ఎలాంటి ఛార్జ్ చేయట్లేదని కేంద్రం ఇటీవల పేర్కొంది.