News February 4, 2025

చైతూను ఇంటర్వ్యూ చేయనున్న సాయి పల్లవి

image

‘తండేల్’ సినిమా విడుదల నేపథ్యంలో చిత్రయూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టింది. అయితే, అనారోగ్య సమస్యలతో హీరోయిన్ సాయి పల్లవి చాలా ప్రమోషన్స్‌కు దూరంగా ఉన్నారు. ఈక్రమంలో సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్స్ చేసేందుకు ఆమె ముందుకొచ్చారు. హీరో చైతూతో స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నానని, ఏవైనా అడిగే ప్రశ్నలుంటే చెప్పాలని సాయి పల్లవి ట్వీట్ చేశారు. ఈనెల 7న ‘తండేల్’ విడుదలవనుంది.

Similar News

News December 9, 2025

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియోమ్యాగ్నటిజమ్‌లో ఉద్యోగాలు

image

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియోమ్యాగ్నటిజమ్‌లో 14 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిప్లొమా, టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ(ఫిజిక్స్, మ్యాథ్స్, జియోఫిజిక్స్,జియాలజీ, ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టిక్స్), ఎంఏ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. డిసెంబర్ 15లోపు దరఖాస్తు హార్డ్ కాపీని స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి. వెబ్‌సైట్: https://iigm.res.in/

News December 9, 2025

ఫ్యూచర్ సిటీలో ‘రేసింగ్ & మోటోక్రాస్’ కేంద్రం

image

TG: భారత్ ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ-ప్రామాణిక ‘రేసింగ్ & మోటోక్రాస్’ కొలువుదీరనుంది. ఈ ప్రాజెక్టు నెలకొల్పేందుకు ‘సూపర్‌క్రాస్ ఇండియా’ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. దీనిలో డర్ట్ ట్రాక్‌లు, రైడర్ శిక్షణ, ఇతర మౌలిక సదుపాయాలను కంపెనీ ఏర్పాటుచేయనుంది. ఇందులో ప్రపంచ రేసింగ్, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా జాతీయ, అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌లను నిర్వహిస్తారు. భూమి, ఇతర ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందించనుంది.

News December 9, 2025

ప్రభాస్ క్షేమంగా ఉన్నారు: డైరెక్టర్ మారుతి

image

‘బాహుబలి: ది ఎపిక్’ ప్రచారంలో హీరో ప్రభాస్, నిర్మాత శోభు యార్లగడ్డ జపాన్‌లో పర్యటిస్తున్నారు. అయితే నిన్న అక్కడ భారీ <<18509568>>భూకంపం<<>> సంభవించడంతో డార్లింగ్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. దీంతో డైరెక్టర్ మారుతి స్పందించారు. ‘నేను ప్రభాస్‌తో మాట్లాడాను. ఆయన సురక్షితంగా ఉన్నారు. ఆందోళన అవసరం లేదు’ అని పేర్కొన్నారు.