News February 6, 2025
రేపు వైసీపీలోకి శైలజానాథ్

AP: మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో చేరనున్నారు. ఇటీవల ఆయన జగన్తో భేటీ కాగా చేరికకు వైసీపీ చీఫ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రేపు ఉ.10 గంటలకు తాడేపల్లిలో శైలజానాథ్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. శైలజానాథ్ అనంతపురం జిల్లా శింగనమల నుంచి 2 సార్లు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా పని చేశారు.
Similar News
News January 2, 2026
రోహిత్ శర్మ ‘పీపుల్స్ కెప్టెన్’: MSK ప్రసాద్

రోహిత్ శర్మ ‘పీపుల్స్ కెప్టెన్’ అని మాజీ చీఫ్ సెలక్టర్ MSK ప్రసాద్ అన్నారు. ‘ధోనీ, కోహ్లీల కాంబినేషన్ రోహిత్. వారిద్దరి నుంచి మంచి క్వాలిటీలను తీసుకుని కెప్టెన్గా ఎదిగారు. ధోనీ నుంచి కూల్నెస్, విరాట్ నుంచి దూకుడు అందిపుచ్చుకుని తనదైన శైలిలో జట్టును నడిపించారు. యంగ్ క్రికెటర్లతో రోహిత్ చాలా సరదాగా ఉంటూ ఫలితాలు రాబట్టారు’ అని ఓ పాడ్కాస్ట్లో వివరించారు.
News January 2, 2026
మొక్కజొన్నకు కత్తెర పురుగుతో తీవ్ర నష్టం.. నివారణ ఎలా?

మొక్కజొన్న తోటల్లో కత్తెర పురుగు ఉద్ధృతి పెరిగింది. ఇది మొక్క మొలక దశ నుంచే ఆశిస్తుంది. ఈ పురుగు లార్వాలు మొక్కజొన్న కాండం, ఆకులను తిని రంధ్రాలను చేస్తాయి. ఇవి పెరుగుతున్న కొద్దీ ఆకుల చివరల నుంచి కత్తిరించినట్లుగా పూర్తిగా తినేస్తాయి. ఆకు సుడులను కూడా తింటాయి. దీని వల్ల మొక్కకు తీవ్ర నష్టం జరిగి పంట దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. కత్తెర పురుగు నివారణకు సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News January 2, 2026
ఇతిహాసాలు క్విజ్ – 115

ఈరోజు ప్రశ్న: రావణుడిని జైలులో పెట్టిన వానర రాజు ఎవరు? తన అజేయమైన శక్తితో రావణుడిని ఏం చేశాడు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>


