News February 6, 2025
రేపు వైసీపీలోకి శైలజానాథ్

AP: మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో చేరనున్నారు. ఇటీవల ఆయన జగన్తో భేటీ కాగా చేరికకు వైసీపీ చీఫ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రేపు ఉ.10 గంటలకు తాడేపల్లిలో శైలజానాథ్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. శైలజానాథ్ అనంతపురం జిల్లా శింగనమల నుంచి 2 సార్లు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా పని చేశారు.
Similar News
News December 1, 2025
ఈ దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుంటే?

స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః|
అనాదినిధనో ధాతా విధాతా ధాతు రుత్తమః||
తనంతట తాను అవతరించిన శాంతి స్వరూపుడు, సూర్యుడికి జన్మనిచ్చిన కలువ పూల కన్నులు కలవాడు విష్ణుమూర్తి. ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించి, నిర్మించి, పాలించే ఆయనను పూజించడం కన్నా మోక్ష మార్గం మరొకటి లేదు. అందుకే ఆ దివ్య మంగళ రూపాన్ని ధ్యానించాలి. అప్పుడే మనస్సుకు శాంతి లభిస్తుంది. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News December 1, 2025
ఈ దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుంటే?

స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః|
అనాదినిధనో ధాతా విధాతా ధాతు రుత్తమః||
తనంతట తాను అవతరించిన శాంతి స్వరూపుడు, సూర్యుడికి జన్మనిచ్చిన కలువ పూల కన్నులు కలవాడు విష్ణుమూర్తి. ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించి, నిర్మించి, పాలించే ఆయనను పూజించడం కన్నా మోక్ష మార్గం మరొకటి లేదు. అందుకే ఆ దివ్య మంగళ రూపాన్ని ధ్యానించాలి. అప్పుడే మనస్సుకు శాంతి లభిస్తుంది. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News December 1, 2025
ప్రోటీన్ సప్లిమెంట్లు తీసుకుంటున్నారా?

ప్రోటీన్ పౌడర్లను సాధారణంగా గుడ్లు, పాలు, సోయా, బఠానీలు లేదా బియ్యం వంటి మొక్కల మూలాలతో తయారు చేస్తారు. కొన్నిసార్లు వీటి మూలాల మిశ్రమంతో తయారు చేస్తారు. చక్కెరతో కూడిన ఈ సప్లిమెంట్లు సమతుల్య ఆహారం ఉద్దేశ్యాన్ని విరుద్ధంగా ఉండడమే కాకుండా, మూత్రపిండాలు, ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వైద్యుల సలహా లేకుండా వీటిని వాడకూడదని సూచిస్తున్నారు.


