News April 12, 2025
జగన్ ప్రధాన సలహాదారుడిగా సజ్జల

AP: 33 మందితో కూడిన PACని వైసీపీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సజ్జల రామకృష్ణారెడ్డిని కన్వీనర్గా నియమించింది. సజ్జలతోపాటు తమ్మినేని, ముద్రగడ, కొడాలి నాని, జోగి రమేశ్, తోట త్రిమూర్తులు, పినిపే విశ్వరూప్, కోన రఘుపతి, విడదల రజిని, రోజా, బ్రహ్మనాయుడు, నందిగం సురేశ్, ఆదిమూలపు సురేశ్, అనిల్ కుమార్ యాదవ్, వైఎస్ అవినాశ్, బుగ్గన, సాకే శైలజానాథ్ తదితరులు ఉన్నారు. వీరంతా జగన్కు రాజకీయ సలహాలు ఇవ్వనున్నారు.
Similar News
News April 13, 2025
ఇందిరమ్మ ఇళ్లపై సీఎం కీలక సూచనలు

TG: ఇందిరమ్మ ఇళ్లను మొదటి దశలో అత్యంత నిరుపేదలకు, అర్హులకు మాత్రమే కేటాయించాలని CM రేవంత్ స్పష్టం చేశారు. ఈ పథకం పారదర్శకంగా, నిరుపేదలకు న్యాయం చేసేలా అమలు కావాలని ఉన్నతస్థాయి సమావేశంలో సూచించారు. లబ్ధిదారుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలు జాగ్రత్తగా పని చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సిమెంట్, స్టీల్ తదితర సామగ్రిని సరసమైన ధరలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
News April 13, 2025
ఇల్లు కొనాలనే తొందరలో తప్పులొద్దు!

సొంతిల్లు కొనాలనే తొందరలో కొందరు చేసే చిన్న తప్పులే మున్ముందు చాలా ఇబ్బందులు తెస్తాయి. ముందుగా అసలు ఇల్లు ఎందుకు కొనాలని అనుకుంటున్నామో స్పష్టత ఉండాలి. ఏ ప్రాంతంలో కొంటున్నాం? అక్కడ వృద్ధి ఎలా ఉంటుంది? అద్దెకు ఇస్తే ఆదాయం ఎంతొస్తుంది? ముందుగా అనుకున్న దాని కంటే ఎక్కువ మొత్తాన్ని వెచ్చిస్తున్నామా? తదితర ప్రశ్నలు వేసుకోకపోతే భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికలు దెబ్బతింటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
News April 13, 2025
మటన్ను ఎంత తినాలి?

నాన్వెజ్ ప్రియులు మటన్ను ఇష్టంగా తింటారు. అయితే, అందులో కొవ్వులు ఎక్కువ ఉండటం వల్ల తగిన మోతాదులోనే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యవంతమైన వ్యక్తి వారానికి గ్రా.300, శారీరక శ్రమ చేసేవారు గ్రా.500 తినొచ్చని చెబుతున్నారు. గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు గ్రా.100 మించి తినకూడదు. అలాగే, సరిగా ఉడకని మటన్ తింటే ఫుడ్ పాయిజన్ అవుతుంది. కొందరికి అజీర్తి ఏర్పడి విరేచనాలు అవుతాయి.