News November 18, 2024

వైసీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా సజ్జల

image

AP: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి ఆ పార్టీ చీఫ్ జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా ఆయనను నియమించారు.

Similar News

News March 10, 2026

వార్ విజువల్స్ షేర్ చేస్తే జైలుకే!

image

సౌదీలో ఎయిర్ కండీషనర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఏపీలోని మదనపల్లెకు చెందిన యువకుడిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అనధికార యుద్ధ సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడమే ఇందుకు కారణం. అటు ఖతర్‌లోనూ యుద్ధానికి సంబంధించిన వీడియోలు తీశారని, అనధికార సమాచారాన్ని ఫార్వర్డ్ చేశారని 313 మందిని అరెస్ట్ చేశారు. UAEలోనూ వార్ విజువల్స్ రికార్డు/షేర్ చేయడం నేరంగా పరిగణిస్తారు. 1-2 ఏళ్ల జైలుశిక్ష విధిస్తారు.

News March 10, 2026

ఆయిల్ సప్లైని ఆపేస్తే… ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్

image

హార్ముజ్ జలసంధి ద్వారా జరిగే ఆయిల్ సప్లైని నిలిపివేసేందుకు యత్నిస్తే ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటి వరకు జరిగిన దాడుల కంటే 20 రెట్ల బలంతో విరుచుకుపడతామని స్పష్టం చేశారు. తిరిగి కోలుకోలేని స్థాయిలో ఇన్‌ఫ్రాను ధ్వంసం చేస్తామన్నారు. అయితే అలాంటి పరిస్థితి రాబోదని ఆశిస్తున్నానన్నారు. చైనా సహా హార్ముజ్‌పై ఆధారపడిన దేశాలకు తానిచ్చే గిఫ్ట్ ఇదేనని వ్యాఖ్యానించారు.

News March 10, 2026

యుద్ధ భయం.. భారీగా పెరిగిన విమాన టికెట్ రేట్లు

image

మిడిల్ ఈస్ట్ దేశాల్లో కొనసాగుతోన్న సంక్షోభాన్ని విమానయాన సంస్థలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. దుబాయ్ నుంచి ముంబైకి నడిచే నాన్ స్టాప్ ఫ్లైట్‌లలో టికెట్ రేట్లను మార్చి 10-15 మధ్య ఏకంగా రూ.45-65వేలకు(సాధారణంగా రూ.10-20వేలు) పెంచాయి. ఇతర ప్రధాన నగరాలకూ ఇదే తరహా రేట్లు ఉన్నాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎమిరేట్స్, ఎయిర్ అరేబియా ఒకదానికొకటి పోటీ పడి వసూలు చేస్తున్నాయి.