News March 4, 2025
సజ్జల బెయిల్ పిటిషన్.. విచారణ వాయిదా

AP: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. వివరాలు సమర్పించేందుకు ప్రభుత్వం సమయం కోరడంతో తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. పోసాని రిమాండ్ రిపోర్టు ఆధారంగా కేసు నమోదయ్యే అవకాశం ఉందంటూ బెయిల్ కోసం ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.
Similar News
News November 15, 2025
ECపై ఆరోపణలను కొట్టిపారేయలేం: స్టాలిన్

బిహార్ ఎన్నికల్లో విజయం సాధించిన నితీశ్ కుమార్కు తమిళనాడు సీఎం స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు RJD నేత తేజస్వీ యాదవ్ క్యాంపైన్ చేసిన తీరును మెచ్చుకున్నారు. ‘ఈ ఫలితాల నుంచి ఇండీ కూటమి నేతలు ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. అలాగే ఈ ఫలితాలతో ఎన్నికల సంఘంపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేయలేం. పౌరులు మరింత పారదర్శక ఎన్నికల సంఘానికి అర్హులు’ అని తెలిపారు.
News November 15, 2025
రెండో రోజు CII సదస్సు ప్రారంభం

AP: విశాఖలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఐఐ సదస్సు రెండో రోజు ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఏయూ ఇంజినీరింగ్ కాలేజీలో జరుగుతున్న రేమండ్ ఫౌండేషన్ ప్రోగ్రామ్కు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఇవాళ దేశ విదేశాలకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ అవుతారు.
News November 15, 2025
తన గమ్యమేంటో జడేజాకు తెలుసు: రవిశాస్త్రి

తన ఫ్యూచర్(IPL)పై బయట జరుగుతున్న చర్చతో ఆల్రౌండర్ జడేజా ఫోకస్ దెబ్బతిందన్న వ్యాఖ్యలపై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ‘అతని తర్వాతి డెస్టినేషన్, సంపాదన ఎంత అనే అంశాలపై అంతా ఆసక్తిగా ఉంటారు. జడేజా ఎంతో అనుభవజ్ఞుడు. టాప్ క్లాస్ క్రికెటర్. తన గమ్యం, క్రికెట్పై చాలా ఫోకస్డ్గా ఉంటాడు. బయట విషయాలు క్రికెట్పై అతనికున్న ఫోకస్ను దెబ్బతీయలేవు’ అని SAతో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా అన్నారు.


