News October 4, 2024

బెయిల్ కోరుతూ హైకోర్టులో సజ్జల పిటిషన్

image

AP: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. సహ నిందితులు ఇచ్చిన వాంగ్మూలంతో రాజకీయ కక్షలో భాగంగానే తనను ఇరికించారని వాపోయారు. కోర్టు షరతులకు కట్టుబడి ఉంటానని, బెయిల్ ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై నేడు కోర్టు విచారణ జరపనుంది.

Similar News

News January 24, 2026

అభిషేక్‌ కెరీర్‌లో తొలి గోల్డెన్ డక్

image

భారత యువ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ కెరీర్‌లో తొలిసారి గోల్డెన్‌ డక్ నమోదు చేసుకున్నారు. NZతో జరుగుతున్న రెండో T20లో తొలి బంతికే అవుటై అభిమానులను నిరాశపరిచారు. జాకబ్‌ డఫీ వేసిన బంతిని ఆడబోయి కాన్వేకు క్యాచ్‌ ఇచ్చారు. ఇది అభిషేక్‌కు T20Iల్లో రెండో డక్‌. 2024లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో (డెబ్యూ) తొలిసారి డకౌట్ అయ్యారు. మొత్తంగా ఐపీఎల్‌తో కలిపి టీ20ల్లో 10 సార్లు 0 పరుగులకే వెనుదిరిగారు.

News January 24, 2026

LRS దరఖాస్తు గడువు పొడిగింపు

image

AP: అనధికార లేఅవుట్ల <<18905073>>రెగ్యులరైజేషన్‌కు<<>> విధించిన గడువును ఏప్రిల్ 23 వరకు పొడిగిస్తున్నట్లు మున్సిపల్ శాఖ ప్రకటించింది. రూ.10వేలు ఫీజు చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ ప్రక్రియలో ఆఫీసర్లు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఇప్పటివరకు 61,947 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించింది. కాగా ముందస్తు షెడ్యూల్ ప్రకారం LRS దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియాల్సి ఉంది.

News January 23, 2026

టీమ్ ఇండియా ఘన విజయం

image

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమ్ ఇండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఇషాన్ కిషన్(76), కెప్టెన్ సూర్యకుమార్(82) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 209 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఇండియన్ బ్యాటర్లను కట్టడి చేయడంలో NZ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. మ్యాట్ హెన్రీ, జాకబ్, ఇష్ సోథీలకు తలో వికెట్ దక్కింది. ఈ విజయంతో 5 T20ల సిరీస్‌లో ఇండియా 2-0 తేడాతో ఆధిపత్యం కొనసాగిస్తోంది.