News October 21, 2025
సలాం పోలీస్

భారత్-చైనా సరిహద్దుల్లోని అక్సాయ్ చిన్ వద్ద 1959 అక్టోబర్ 21న పంజాబ్ DSP కరమ్ సింగ్ నేతృత్వంలోని CRPF బృందం గస్తీ కాస్తోంది. అదే సమయంలో సియాచిన్ ఆక్రమణకు ప్రయత్నిస్తూ చైనా దాడులకు దిగింది. వీరిని ఎదుర్కొంటూ చేసిన పోరాటంలో 10 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది అమరులయ్యారు. వారి సేవలను స్మరిస్తూ అప్పటి నుంచి ఏటా అక్టోబర్ 21న పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
Similar News
News October 21, 2025
ఆక్వా రైతులకు శుభవార్త చెప్పిన లోకేశ్

AP: ఆక్వా రైతులకు మంత్రి నారా లోకేశ్ శుభవార్త చెప్పారు. ఇప్పటివరకు తెల్లమచ్చ వైరస్ కారణంగా పొట్టు తీయని రొయ్యల ఎగుమతులపై ఆస్ట్రేలియా పరిమితులు విధించగా తాజాగా వాటిని ఎత్తివేసి ఎగుమతులకు అనుమతించిందని మంత్రి చెప్పారు. దీనికోసం కృషిచేసిన ఇండియా, ఆస్ట్రేలియా ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు కొత్త మార్కెట్లకు విస్తరించాల్సిన అవసరముందని ఇది నిరూపిస్తోందని వివరించారు.
News October 21, 2025
తరింపజేసే పంచమహామంత్రాలు

మనః అంటే మనసు, త్ర అంటే రక్షించేది. మనసును రక్షించేదే మంత్రం. ఇది దైవస్వరూపం. మంత్రం ఉచ్చరించినపుడు అందులో నాదబలం మనసును శాంతపరచి, ఆత్మను ఉన్నతస్థితికి తీసుకెళ్తుంది. పంచమహామంత్రాలివే..
1.ఓంనమఃశివాయ- పంచాక్షరీమంత్రం 2.ఓం నమో నారాయణాయ-అష్టాక్షరీమంత్రం 3.ఓం నమో భగవతే వాసుదేవాయ-ద్వాదశాక్షరీ మంత్రం, 4.ఓంభూర్భువఃస్వహ-గాయత్రీ మంత్రం, 5.ఓంత్రయంబకం యజామహే-మహామృత్యుంజయ మంత్రం.
News October 21, 2025
మహిళలు రోజుకొక ఆరెంజ్ తింటే..

ఆరెంజ్లలో ఉండే విటమిన్-C కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తుంది. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలను తగ్గిస్తాయి. రోజుకొక ఆరెంజ్ తింటే ఒత్తిడి 20% తగ్గుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. గర్భిణులకు అవసరమైన ఫోలేట్ వంటి పోషకాలను అందిస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇందులోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను, కొలెస్ట్రాల్ను నియంత్రిస్తుంది.