News March 20, 2025

ఆ ఉద్యోగులకు భారీగా పెరగనున్న జీతాలు

image

దేశంలోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(GCC)లో పని చేసే ఉద్యోగుల వేతనాలు వచ్చే ఏడాదిలో 9.8% మేర పెరగనున్నట్లు ఓ నివేదిక అంచనా వేసింది. ఉద్యోగుల వేతనాల వృద్ధిలో GCCలు IT కంపెనీలను మించిపోయాయంది. 2030 నాటికి వీటి మార్కెట్ విలువ 11,000కోట్ల డాలర్లకు చేరవచ్చని పేర్కొంది. దీంతో నైపుణ్యాలున్న ఉద్యోగులకు వేతనాలు గణనీయంగా పెరుగుతాయంది. ప్రస్తుతం హైదరాబాద్, ముంబై GCCలు అధిక జీతాలు చెల్లిస్తున్నాయి.

Similar News

News March 20, 2025

IPL రూల్స్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం

image

IPLలో కొన్ని రూల్స్‌పై బీసీసీఐ BCCI కీలక నిర్ణయం తీసుకుంది. సలైవాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై బౌలర్లు బంతిపై ఉమ్మి రుద్దుకోవచ్చని తెలిపింది. ఈ నిర్ణయం బౌలర్లకు కలిసొస్తుంది. అలాగే సెకండ్ ఇన్నింగ్స్‌లో 2 బంతులు వినియోగించుకోవచ్చని పేర్కొంది. రెండో ఇన్నింగ్స్ 11 ఓవర్ల తర్వాత రెండో బంతిని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను యథావిధిగా కొనసాగించనుంది.

News March 20, 2025

చట్ట అనుమతి ఉన్న గేమ్స్‌కే ప్రచారం: VD టీమ్

image

బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌పై హీరో విజయ్ దేవరకొండ టీమ్ స్పందించింది. ‘రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని మాత్రమే ఆయన అంబాసిడర్‌గా పనిచేసేందుకు కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. చట్ట అనుమతి ఉన్న గేమ్స్‌కి మాత్రమే ఆయన ప్రచారం చేసేందుకు ఒప్పుకున్నారు. ఇప్పుడు ఎ23 సంస్థతో విజయ్‌కు ఎలాంటి సంబంధం లేదు. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని సుప్రీం కూడా పలుమార్లు చెప్పింది’ అని ఆయన టీమ్ వివరణ ఇచ్చింది.

News March 20, 2025

ఎస్సీలను ఆదుకుంది TDPనే: చంద్రబాబు

image

AP: ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం ఇళ్లు ఇచ్చింది ఎన్టీఆరేనని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎస్సీలను అన్నివిధాల ఆదుకుంది టీడీపీనేనని అసెంబ్లీలో పేర్కొన్నారు.. ‘దళితులైన బాలయోగిని లోక్‌సభ స్పీకర్, ప్రతిభాభారతిని అసెంబ్లీ స్పీకర్, కాకి మాధవరావును సీఎస్ చేశాం. ఎస్సీల కోసం రూ.8,400 కోట్లతో పథకాలు తీసుకొచ్చాం. ఉగాది నుంచి పీ4 ప్రారంభిస్తాం. వర్గీకరణకు సహకరించిన BJPకి, పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

error: Content is protected !!