News March 19, 2024
త్వరలోనే వారికి వేతనాల పెంపు!

ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. మెరుగైన పనితీరు కనబరిచిన ఉద్యోగులకు 12-15 శాతం వేతనం పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ పెంపు ప్రక్రియ ముగింపు దశకు వచ్చినట్లు ‘బిజినెస్ స్టాండర్డ్’ కథనం పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచే ఈ వేతన పెంపు అమల్లోకి వస్తుందని తెలుస్తోంది. దీనిపై టీసీఎస్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
Similar News
News October 15, 2025
APPLY NOW: చిత్తూరులో 56 పోస్టులు

AP: చిత్తూరులోని డిస్ట్రిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్(DHMO) 56 కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 22వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, డిగ్రీ, ఎంబీబీఎస్, GNM, నర్సింగ్ డిగ్రీ, సీఏ, ఎంకామ్, ఎంబీఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. విద్యార్హతలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://chittoor.ap.gov.in/
News October 15, 2025
ఏపీ ఆరోగ్యానికి YCP హానికరం: లోకేశ్

మెడికల్ కాలేజీలను త్వరితగతిన పూర్తిచేసి పేద విద్యార్థులకు మేలు చేసేందుకే PPP విధానాన్ని తెచ్చామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. ‘గతంలో పేద విద్యార్థులకు 42% సీట్లు ఇస్తే, PPP కళాశాలల్లో 50% సీట్లు ఉచితంగా ఇవ్వాలని చెప్పాం. ప్రభుత్వ ఆస్తులను అమ్మడం లేదు. కేవలం పెట్టుబడిదారులను అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నాం. ఈ విషయంలో వైసీపీకి క్లారిటీ లేదు. రాష్ట్ర ఆరోగ్యానికి YCP హానికరం’ అని విమర్శించారు.
News October 15, 2025
ముందస్తు బెయిల్ పిటిషన్లపై అమికస్ క్యూరీ నివేదిక

ముందస్తు బెయిళ్లపై సెషన్స్ కోర్టులకే ప్రాధాన్యముండాలని సిద్ధార్థ్ లూథ్రా, అరుద్ర రావులతో కూడిన అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు నివేదించింది. ప్రత్యేక స్థితుల్లోనే HIGH COURTS వాటిని అనుమతించాలంది. నిందితుడి నివాసం సెషన్ కోర్టు పరిధిలో లేనపుడు, అల్లర్లు వంటి సమస్యలపుడు, అనారోగ్యం ఇతర కారణాలతో సెషన్స్ కోర్టును ఆశ్రయించలేనపుడు, న్యాయ ప్రక్రియ దుర్వినియోగాన్ని నివారించాల్సినపుడు మాత్రమే తీసుకోవాలంది.