News March 19, 2024

త్వరలోనే వారికి వేతనాల పెంపు!

image

ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. మెరుగైన పనితీరు కనబరిచిన ఉద్యోగులకు 12-15 శాతం వేతనం పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ పెంపు ప్రక్రియ ముగింపు దశకు వచ్చినట్లు ‘బిజినెస్ స్టాండర్డ్’ కథనం పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచే ఈ వేతన పెంపు అమల్లోకి వస్తుందని తెలుస్తోంది. దీనిపై టీసీఎస్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

Similar News

News December 3, 2025

IPL-2026: వీరిలో ఎవరిని మిస్ అవుతారు?

image

ఫారిన్ ప్లేయర్లు రసెల్, డుప్లెసిస్ IPLకు రిటైర్మెంట్ ప్రకటించగా మరో ప్లేయర్ మ్యాక్స్‌వెల్ వచ్చే సీజన్‌కు అందుబాటులో ఉండట్లేదని అనౌన్స్ చేశారు. తమదైన ఆటతో మ్యాచు స్వరూపాన్నే మార్చేయడంలో వీరు దిట్ట. స్థిరత్వానికి డుప్లెసిస్ మారుపేరు కాగా, ఆల్‌రౌండర్ కోటాలో మ్యాక్సీ, రసెల్ రాణించిన సందర్భాలు చాలా ఉన్నాయి. వీరి స్థానాలను ఇప్పటికిప్పుడు భర్తీ చేయడం కష్టమే. మీరు వీరిలో ఎవరి ఆట మిస్ అవుతారు? కామెంట్.

News December 3, 2025

పిల్లల జీవితానికి ఈ అలవాట్లే పునాదులు

image

చిన్నతనంలోనే పిల్లలకు కొన్ని అలవాట్లు నేర్పిస్తే వారిలో ప్రశాంతతతోపాటు క్రమశిక్షణ, ఏకాగ్రత, జీవన నైపుణ్యాలు మెరుగవుతాయంటున్నారు నిపుణులు. ఉదయాన్నే త్వరగా నిద్ర లేవడం, బెడ్ సర్దడం, తమంతట తామే రెడీ కావడం, వ్యాయామం, క్లీనింగ్, గార్డెనింగ్ చేయించడం వల్ల వారిలో ఉత్పాదకత పెరుగుతుందని చెబుతున్నారు. వీటితో పాటు పుస్తకాలు చదవడం, కృతజ్ఞతాభావం అలవాటు చేయడం వారికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయంటున్నారు.

News December 3, 2025

19 దేశాలపై మరిన్ని ఆంక్షలు విధించిన ట్రంప్

image

సిటిజన్‌షిప్, గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్‌తోపాటు అన్ని ఇమ్మిగ్రేషన్ అప్లికేషన్ల స్వీకరణను అమెరికా తాత్కాలికంగా నిలిపివేసింది. అఫ్గానిస్థాన్, సోమాలియా సహా 19 నాన్ యూరోపియన్ దేశాలపై ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. నేషనల్ సేఫ్టీ, ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. US నేషనల్ గార్డుపై అఫ్గానిస్థాన్ పౌరుడు దాడి చేసిన నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది.