News October 4, 2024
ఒక్కో కార్మికుడికి ₹1.92 లక్షల జీతం, ₹16,515 బోనస్

పాలస్తీనా, లెబనాన్, ఇరాన్తో యుద్ధాల వల్ల ఇజ్రాయెల్లో ఏర్పడిన కార్మికుల కొరత భారతీయులకు కాసుల పంట కురిపిస్తోంది. ఇజ్రాయెల్లో పనిచేయడానికి భారత ప్రభుత్వం ద్వారా ఎంపికైన స్కిల్డ్ వర్కర్స్కు నెలకు ₹1.92 లక్షల జీతం, ₹16,515 బోనస్, వైద్య బీమా, వసతి లభిస్తోంది. ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా సరే భారతీయులు అక్కడ పనిచేయడానికి క్యూ కడుతున్నారు. ఇప్పటిదాకా 11 వేల మందిని ఎంపిక చేశారు.
Similar News
News March 7, 2026
ఇండియన్ బిలియనీర్ల సంపద రూ.112 లక్షల కోట్లు

హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2026 ప్రకారం బిలియనీర్ల సంఖ్య 4,020కి చేరింది. గతేడాదితో పోలిస్తే 578 మంది పెరిగారు. 1,100 బిలియనీర్లతో చైనా టాప్లో ఉండగా, ఆ తర్వాత US(1,000), IND(308) ఉన్నాయి. ఇండియన్ బిలియనీర్ల సంపద ₹112L Cr. ఇక ఎలాన్ మస్క్ $792Bn ఆస్తితో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. ఆ తర్వాత జెఫ్ బెజోస్-అమెజాన్($300Bn), లారీ పేజ్-ఆల్ఫాబెట్($271Bn), లారీ ఎల్లిసన్-ఒరాకిల్($267Bn) ఉన్నారు.
News March 7, 2026
WC ఫైనల్లో గెలిచేది ఇండియానే: ChatGpt

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 WC <<19308021>>ఫైనల్లో<<>> గెలుపెవరిదో ఏఐ ఏజెంట్లు ChatGpt & Gemini ప్రిడిక్ట్ చేశాయి. NZతో జరిగే ఈ మ్యాచులో సొంతగడ్డపై ఇండియా సత్తా చూపిస్తుందని, సూర్యకుమార్ ట్రోఫీ లిఫ్ట్ చేస్తారని పేర్కొన్నాయి. ‘స్పిన్నర్స్ & బ్యాటర్లకు పిచ్ అనుకూలంగా ఉంది. ప్రేక్షకుల వల్ల ప్రత్యర్థిపై ఒత్తిడి పెరుగుతుంది. NZ 170 స్కోర్ చేయగలదు. IND ఈజీగా ఛేజ్ చేస్తుంది’ అని తెలిపాయి.
News March 7, 2026
నటుడు మురళీధర్ భార్య కన్నుమూత

ప్రముఖ టాలీవుడ్ నటుడు మురళీధర్ గౌడ్ భార్య శశికళ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ మరణించారు. దీంతో ఆయన ఇంట్లో విషాదం నెలకొంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసిన మురళీధర్ రిటైర్మెంట్ తర్వాత నటనపై ఆసక్తితో సినిమా ప్రయత్నాలు చేశారు. రంగ స్థలం, డీజే టిల్లు, టిల్లు స్క్వేర్, బలగం, మ్యాడ్, మేం ఫేమస్ తదితర చిత్రాలతో గుర్తింపు పొందారు.


