News August 12, 2024
నెలకు రూ.1.50 లక్షల జీతం సరిపోవడం లేదని ట్వీట్

ఏటా ₹25లక్షల జీతం వస్తున్నా, ముగ్గురితో కూడిన తమ కుటుంబానికి ఏమీ మిగలడం లేదని సౌరవ్ దత్త అనే వ్యక్తి చేసిన పోస్ట్ Xలో వైరలవుతోంది. ‘నెలకు ₹1.50లక్షలు వస్తాయి. అందులో ₹లక్ష EMI, రెంట్కు, ₹25వేలు ఫుడ్, సినిమాలు, ట్రిప్స్కు, ₹25వేలు ఎమర్జెన్సీ/మెడికల్కి సరిపోతుంది. ఇలా మొత్తం ఖర్చవుతోంది. ఇన్వెస్ట్మెంట్కు ఏమీ మిగలడం లేదు’ అని ట్వీట్ చేశారు. ఇంత జీతం మీకే వస్తే ఎలా సేవ్ చేస్తారు? కామెంట్ చేయండి.
Similar News
News November 27, 2025
రిజర్వేషన్లపై హైకోర్టులో నేడే విచారణ

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలంటూ <<18397909>>దాఖలైన<<>> పిటిషన్పై ఇవాళ HCలో విచారణ జరగనుంది. జనాభా గణాంకాలను వెల్లడించకుండా రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 46ను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ వేశారు. దీని వల్ల బీసీల్లోని కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని, రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలని కోరారు. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ వేళ దీనిపై HC ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.
News November 27, 2025
రాష్ట్రంలో 60 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (<
News November 27, 2025
చలికాలంలో పాదాలు పగులుతున్నాయా?

చలికాలంలో కనిపించే ప్రధాన సమస్యల్లో మడమల పగుళ్లు ఒకటి. చలి కాలంలో పొడి గాలుల కారణంగా మడమల చర్మంలో తేమ తగ్గుతుంది. ఈ కారణంగా చర్మం పొడిగా మారి పాదాలలో పగుళ్లు ఏర్పడుతాయి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ అప్లై చేసి సాక్సులు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. డీ హైడ్రేషన్ వల్ల కూడా పాదాలు పగులుతాయి కాబట్టి తగినంత నీరు తాగాలని చెబుతున్నారు.


