News February 11, 2025
బీటెక్ అర్హతతో రూ.1.60 లక్షల వేతనం

BHEL(భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్) 400 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 150 ఇంజినీర్ ట్రైనీ, 250 సూపర్వైజర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు సంబంధిత విభాగంలో డిగ్రీ/ఇంజినీరింగ్/ఇంజినీర్ డిప్లొమా చదివి ఉండాలి. వయసు 27 ఏళ్లు మించకూడదు. నెల జీతం రూ.32,000 నుంచి రూ.1,60,000 వరకు ఉంటుంది. ఈ నెల 28లోగా అభ్యర్థులు రూ.1,072 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. https://cdn.digialm.com
Similar News
News November 14, 2025
IND vs SA టెస్ట్.. తొలిరోజు స్కోర్ ఎంతంటే?

ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌత్ ఆఫ్రికాపై తొలి టెస్టులో భారత్ చెలరేగింది. తొలుత బ్యాటింగ్ చేసిన SAను 159కే ఆలౌట్ చేసింది. మార్క్రమ్(31), ముల్డర్(24), టోనీ(24), రికెల్టన్(23) ఫర్వాలేదనిపించారు. బుమ్రా 5, సిరాజ్, కుల్దీప్ చెరో 2, అక్షర్ 1 వికెట్ తీశారు. బ్యాటింగ్లో జైస్వాల్(12) అవుటవ్వగా.. KL రాహుల్(13*), సుందర్(6*) క్రీజులో ఉన్నారు. తొలిరోజు ఆటముగిసే సరికి IND ఒక వికెట్ నష్టానికి 37 రన్స్ చేసింది.
News November 14, 2025
జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు: రేవంత్

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు తమ బాధ్యతను పెంచిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 51 శాతం ప్రజలు జూబ్లీహిల్స్ లో తమకు ఓటు వేశారని చెప్పారు. ‘గత అసెంబ్లీ ఎన్నికల్లో మాకు హైదరాబాద్లో సానుకూల ఫలితాలు రాలేదు. ప్రజలు మా తీరును గమనించి తీర్పును ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వస్తాయి’ అని ధీమా వ్యక్తం చేశారు.
News November 14, 2025
పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్లాన్ ఫెయిల్.. డిపాజిట్లు గల్లంతు

పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ప్రశాంత్ కిశోర్కు మంచి పేరుంది. ఎన్నికలు ఏవైనా ఆయన ప్లాన్ చేస్తే ఆ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందనే టాక్ ఉండేది. అయితే ఆ వ్యూహాలు తాను స్థాపించిన జన్ సురాజ్ పార్టీని అధికార పీఠం దగ్గరకు కూడా తీసుకొని వెళ్లలేకపోయాయి. బిహార్ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన మొత్తం 239 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 2% ఓటు షేర్ మాత్రమే జన్ సురాజ్కు దక్కింది.


