News November 9, 2024
ఇవాళ్టి నుంచే శనగ విత్తనాల విక్రయాలు

TG: యాసంగి సీజన్ కోసం రైతులకు నేటి నుంచి శనగ విత్తనాలను పంపిణీ చేయనున్నారు. క్వింటాలు ధర రూ.9,000 ఉండగా, ప్రభుత్వం రూ.300 రాయితీ ఇస్తోంది. జేజీ 11, జాకీ రకాల విత్తనాలను 20వేల క్వింటాళ్ల వరకు అందుబాటులో ఉంచారు. కేఎన్ఎం 1638, ఆర్ఎన్ఆర్ 15048, జేజీఎల్ 24423 రకాలు 50వేల క్వింటాళ్ల వరకు విక్రయించనున్నారు. కరోనాకు ముందు 33% రాయితీతో విక్రయించగా, ఇప్పుడు 3.3% సబ్సిడీనే ఇవ్వడంపై రైతులు మండిపడుతున్నారు.
Similar News
News January 6, 2026
అమర్త్యసేన్కు SIR నోటీసులా?: TMC నేత ఫైర్

SIR విచారణకు రావాలని నోబెల్ గ్రహీత అమర్త్యసేన్కు EC నోటీసులిచ్చిందని TMC నేత అభిషేక్ బెనర్జీ అన్నారు. బెంగాల్ ప్రజలను ఎన్నికల సంఘం, బీజేపీ వేధింపులకు గురిచేస్తున్నాయని మండిపడ్డారు. ‘దేశం గర్వించదగిన అమర్త్యసేన్ను విచారణకు ఎలా పిలుస్తారు? ప్రముఖ నటుడు దేవ్, వరల్డ్ కప్లో భారత్ తరఫున ఆడిన షమీకి నోటీసులిచ్చారు. ఇది బాధాకరం’ అని అన్నారు. దీనిపై ఎన్నికల సంఘం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News January 6, 2026
విశాఖలో ఇన్ఫోసిస్ పర్మనెంట్ క్యాంపస్!

AP: విశాఖలో పర్మనెంట్ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ఇన్ఫోసిస్ సిద్ధమవుతోంది. యెండాడ, పరదేశిపాలెం సమీపంలో ఆ కంపెనీ ప్రతినిధులు భూములు పరిశీలించారు. ఎకరం 99 పైసల చొప్పున 20 ఎకరాలు లీజుకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల చివర్లో దీనిపై ప్రకటన రానుంది. ఇన్ఫోసిస్తో పాటు TCS, యాక్సెంచర్, కాగ్నిజెంట్ కంపెనీల రాకతో విశాఖలో ఐటీ క్రేజ్, ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉంది.
News January 6, 2026
సింధూ తులాని ఇప్పుడెలా ఉన్నారంటే?

‘మన్మధ’, ‘గౌతమ్ SSC’, ‘అతనొక్కడే’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి సింధూ తులాని లేటెస్ట్ ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. చాలా కాలంగా వెండితెరకు దూరంగా ఉన్న ఆమె ప్రస్తుతం గుర్తుపట్టలేనంతగా మారిపోవడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ‘మన్మధ’లో తన అందం, అభినయంతో మెప్పించింది ఈ ముద్దుగుమ్మనేనా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సింధు ముంబైలో ఫ్యామిలీతో ఉంటున్నారు.


