News April 12, 2025
సలేశ్వరం లింగమయ్య జాతర ప్రారంభం

TG: నల్లమల అడవుల్లో ప్రకృతి రమణీయత మధ్యలో వెలిసిన శ్రీ సలేశ్వరం లింగమయ్య జాతర నిన్న ఘనంగా ప్రారంభమైంది. నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు. సుమారు 18 కి.మీ దట్టమైన అటవీ ప్రాంతంలో నడిచి స్వామివారిని చేరుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ యాత్రను తెలంగాణ అమరనాథ్ అని పిలుస్తుంటారు. 3రోజుల జాతర కోసం అన్ని ఏర్పాట్లూ చేశామని అధికారులు తెలిపారు.
Similar News
News January 5, 2026
J&K మొత్తం ఇండియాలోనే ఉండాలి: బాబ్ బ్లాక్మన్

POK సహా J&K అంతా ఇండియాలోనే ఉండాలని బ్రిటన్ MP బాబ్ బ్లాక్మన్ అభిప్రాయపడ్డారు. ఈ అంశంలో భారత్కు అంతర్జాతీయ సమాజం మద్దతు ఇవ్వాలని జైపూర్లోని కాన్స్టిట్యూషన్ క్లబ్ సభలో పిలుపునిచ్చారు. ఆర్టికల్ 370ని తొలగించాలని 1992లోనే చెప్పానన్నారు. కశ్మీరీ పండితులను అక్కడి నుంచి వెళ్లగొట్టడాన్ని వ్యతిరేకించానని గుర్తుచేశారు. మతం పేరిట ప్రజలను వెళ్లగొట్టడం అన్యాయమని ప్రపంచానికి తెలిపానన్నారు.
News January 5, 2026
IPL ప్రసారంపై బ్యాన్.. బంగ్లా సంచలన నిర్ణయం

భారత్తో వైరం ముదరడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో IPL ప్రసారంపై నిషేధం విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ బ్యాన్ అమలు చేయాలని బ్రాడ్కాస్టర్లను ఆదేశించింది. బంగ్లాలో హిందువులపై దాడుల నేపథ్యంలో KKR టీమ్ నుంచి ముస్తాఫిజుర్ను <<18748860>>తీసేయడంతో<<>> ఈ వివాదం చెలరేగింది. తాము T20 WC కోసం భారత్కు రాబోమని ICCకి BCB <<18761652>>లేఖ<<>> రాసింది. ఈక్రమంలోనే IPL ప్రసారంపై బ్యాన్ విధించింది.
News January 5, 2026
లాప్స్ అయిన పాలసీని రివైవ్ చేస్తే లాభామేనా?

లాప్స్ అయిన పాలసీలను మళ్లీ రివైవ్ చేసుకునే అవకాశాన్ని LIC కల్పించింది. దీనివల్ల పలు లాభాలు ఉంటాయి. పాలసీలో చేరినప్పటి వయసు ప్రకారమే తక్కువ ప్రీమియం కొనసాగుతుంది. పాత పాలసీల్లో మినహాయింపులు తక్కువగా ఉంటాయి. కొత్తగా మెడికల్ చెకప్స్ చేయించుకునే అవసరం ఉండదు. కట్టాల్సిన బాకీ ప్రీమియం మొత్తాన్ని మార్చి 2లోపు చెల్లించి పునరుద్ధరించుకోవచ్చు. 30% డిస్కౌంట్ కూడా ఉంది.


