News April 12, 2025
సలేశ్వరం లింగమయ్య జాతర ప్రారంభం

TG: నల్లమల అడవుల్లో ప్రకృతి రమణీయత మధ్యలో వెలిసిన శ్రీ సలేశ్వరం లింగమయ్య జాతర నిన్న ఘనంగా ప్రారంభమైంది. నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు. సుమారు 18 కి.మీ దట్టమైన అటవీ ప్రాంతంలో నడిచి స్వామివారిని చేరుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ యాత్రను తెలంగాణ అమరనాథ్ అని పిలుస్తుంటారు. 3రోజుల జాతర కోసం అన్ని ఏర్పాట్లూ చేశామని అధికారులు తెలిపారు.
Similar News
News November 14, 2025
దానిమ్మలో బ్యాక్టీరియా మచ్చ తెగులు

దానిమ్మలో బ్యాక్టీరియా మచ్చ తెగులు పంట దిగుబడిని, కాపుకొచ్చిన కాయల నాణ్యతనూ తగ్గిస్తోంది. తెగులుకు కారణమయ్యే బ్యాక్టీరియా.. మొక్క ఆకులు, రెమ్మలు, కాయలపైన మచ్చలు కలగజేస్తుంది. ఈ తెగులుకు గురైన మొక్క ఆకులు రాలిపోవడం, కొమ్మలు విరిగిపోవడం జరుగుతుంది. కాయలపై ముదురు గోధుమ రంగు నుంచి నలుపు రంగు గరుకు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చల మధ్యభాగంలో కాయలపై పగుళ్లు ఏర్పడి మార్కెట్కు పనికిరాకుండాపోతాయి.
News November 14, 2025
దానిమ్మలో బ్యాక్టీరియా మచ్చ తెగులు నివారణ

తెగులు ఆశించిన కొమ్మలను, కాయలను కత్తిరించి నాశనం చేయాలి లేదా కాల్చివేయాలి. తోటలో చెట్ల పాదుల్లో ఎకరాకు 8-10KGల బ్లీచింగ్ పౌడరును చల్లాలి. మొక్కలలో తెగులు లక్షణాలు కనిపిస్తే లీటరు నీటికి బ్లైటాక్స్ 3గ్రా.+ స్ట్రెప్టోసైక్లిన్ 0.2గ్రా కలిపి మొక్క బాగాలు తడిచేటట్లు స్ప్రే చేయాలి. ఈ మందులు పిచికారీ చేసిన వారం, 10 రోజుల తర్వాత కాసుగామైసిన్ (లీటరు నీటికి 3ml)ను స్ప్రే చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
News November 14, 2025
పరకామణి కేసు ఫిర్యాదుదారు సతీశ్ అనుమానాస్పద మృతి

TTD పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారు, మాజీ AVSO సతీశ్ అనుమానాస్పదంగా మరణించారు. తాడిపత్రి వద్ద రైల్వేట్రాక్పై ఆయన మృతదేహాన్ని గుర్తించారు. సతీశ్ ఫిర్యాదుతో Sr Asst రవికుమార్పై 2023 మేలో విజిలెన్సు ఛార్జిషీట్ దాఖలు చేయగా, లోక్అదాలత్లో రాజీతో ఆయన TTDకి కొన్ని ఆస్తులు అప్పగించారు. దీనిపై పిటిషన్ దాఖలు కాగా హైకోర్టు ఆదేశాలతో CID విచారిస్తోంది. కేసులో YCP నేతలపై TDP ఆరోపణలు చేస్తుండడం తెలిసిందే.


