News July 5, 2024

అనంత్ అంబానీ సంగీత్‌లో సల్మాన్, రణ్‌వీర్ డాన్సులు

image

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల సంగీత్ కార్యక్రమం ఈరోజు రాత్రి ముంబైలో జరగనుంది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ తారలు సల్మాన్ ఖాన్, రణ్‌వీర్ సింగ్, జాన్వీ కపూర్ ఆడిపాడనున్నట్లు తెలుస్తోంది. దీని కోసం గడచిన వారం రోజులుగా వారు రిహార్సల్స్ చేస్తున్నట్లు సమాచారం. ప్రముఖ పాప్ గాయకుడు జస్టిన్ బీబర్ సైతం ఈ కార్యక్రమంలో పాడేందుకు భారత్‌కు చేరుకున్నారు.

Similar News

News July 8, 2024

సీఎంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భేటీ

image

TG: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం ఇంటికి వెళ్లి కలిశారు. దీంతో ఆయన పార్టీ మారనున్నారనే <<13585753>>ప్రచారానికి<<>> బలం చేకూరినట్లైంది. రేవంత్ మహబూబ్‌నగర్ పర్యటనలో భాగంగా చల్లా కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.

News July 8, 2024

హైదరాబాద్‌లో చంద్రబాబు, వైఎస్సార్ ఫ్లెక్సీలు

image

చాలా రోజుల తర్వాత హైదరాబాద్ నగరంలో చంద్రబాబు, వైఎస్సార్ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్ వచ్చిన సందర్భంగా చంద్రబాబువి, జయంతి సందర్భంగా వైఎస్సార్ ఫ్లెక్సీలను టీడీపీ, కాంగ్రెస్ అభిమానులు ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఏపీలో ఈ ఇద్దరు నాయకులు సీఎంలుగా హైదరాబాద్ నుంచే పాలన సాగించారు. కాగా, తెలంగాణలోనూ టీడీపీ జెండా ఎగరేస్తామని చంద్రబాబు నిన్న కార్యకర్తల సమావేశంలో చెప్పారు.

News July 8, 2024

T20WC: ఒక్కో క్రికెటర్‌కు ₹5కోట్లు

image

టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు BCCI ₹125కోట్లు నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని పంచగా 15మంది ఆటగాళ్లు, కోచ్ ద్రవిడ్‌కి ఒక్కొక్కరికి ₹5కోట్లు రానున్నాయి. మిగిలిన కోచ్‌లు ₹2.5కోట్ల చొప్పున అందుకుంటారు. బ్యాక్‌రూమ్ స్టాఫ్ తలా ₹2కోట్లు, సెలెక్షన్ కమిటీలోని సభ్యులు, రిజర్వ్ ప్లేయర్లు ₹కోటి చొప్పున అందుకుంటారు. వాంఖడేలో ఇప్పటికే దీనికి సంబంధించిన చెక్కును BCCI జట్టుకు అందించింది.