News April 19, 2024
లైంగిక జీవితానికి ముప్పుగా ఉప్పు?

ఉప్పు అధికంగా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా తీసుకోవడం వల్ల పురుషుల్లో అంగస్తంభన సమస్యలు పెరుగుతాయని అంటున్నారు. దీనిని తినడం వల్ల రక్తనాళాలపై అధిక ఒత్తిడి పడి హైపర్ టెన్షన్, బీపీ సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యలతో బాధపడేవారు లైంగిక చర్యలో సరిగ్గా పాల్గొనలేరు. దీనిని అధికంగా తినడం వల్ల స్త్రీలలో కూడా లైంగిక కోరికలు తగ్గుతున్నట్లు వెల్లడైంది. అధికంగా తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు.
Similar News
News November 21, 2025
నకిలీ ORSలను వెంటనే తొలగించండి: FSSAI

ఫుడ్ సేఫ్టీ&స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) నకిలీ ORSలపై స్టేట్స్, కేంద్రపాలిత ప్రాంతాల కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. మిస్ లీడింగ్, మోసపూరిత ఎలక్ట్రోలైట్ పానియాలను దుకాణాలు, ఇ-కామర్స్ సైట్ల నుంచి తొలగించాలంది. మార్కెట్లో ORS పేరుతో నకిలీ డ్రింక్స్ చలామణి అవుతున్నట్లు FSSAI గుర్తించింది. ఇవి WHO గైడ్లైన్స్ ప్రకారం ORS స్టాండర్డ్స్లో లేనందున అమ్మకానికి ఉంచకుండా చూడాలని కోరింది.
News November 21, 2025
ఇంటలెక్చువల్ టెర్రరిస్టులు మరింత ప్రమాదం: ఢిల్లీ పోలీసులు

టెర్రరిస్టుల కంటే వారిని నడిపిస్తున్న ఇంటలెక్చువల్స్ మరింత ప్రమాదకరమని సుప్రీంకోర్టులో ASG రాజు చెప్పారు. డాక్టర్లు, ఇంజినీర్లు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం ట్రెండ్గా మారిందన్నారు. 2020 ఢిల్లీ అల్లర్లు, నవంబర్ 10 రెడ్ఫోర్ట్ పేలుళ్లే ఉదాహరణలని గుర్తుచేశారు. విచారణ ఆలస్యాన్ని కారణంగా చూపిస్తూ నిందితులు బెయిల్ కోరుతున్నారన్నారు. ఢిల్లీ అల్లర్ల కేసులో పోలీసుల తరఫున ASG వాదనలు వినిపించారు.
News November 21, 2025
23న పెళ్లి.. స్మృతికి మోదీ గ్రీటింగ్స్

స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. మరో మూడు రోజుల్లో అంటే ఈ నెల 23న ఆమె తన ప్రియుడు పలాశ్ ముచ్చల్తో ఏడడుగులు వేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మంధాన-ముచ్చల్ జోడీకి గ్రీటింగ్స్ తెలుపుతూ లేఖ రాశారు. వివాహ బంధంలో ఎల్లప్పుడూ ఒకరికొకరు తోడుగా ఉంటూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కాగా స్మృతి-పలాశ్ ఎంగేజ్మెంట్ ఇప్పటికే పూర్తయింది.


