News November 5, 2024
సెల్యూట్ తల్లి.. భర్త మరణంతో కుటుంబానికి అండగా!

కుటుంబానికి అండగా నిలిచేందుకు, ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ఎంత కష్టమైనా చేసే మహిళలున్నారు. అలాంటి ఓ మహిళ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. MSc చదివిన సుప్రీతి సింగ్ తన భర్త ఆకస్మికంగా మరణించడంతో ఫ్లిప్కార్ట్లో డెలివరీ పర్సన్గా చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. అత్తామామ, పిల్లలను సంతోషంగా ఉంచేందుకు ఆమె రేయింబవళ్లు శ్రమిస్తోంది. సుప్రీతి ఎందరికో స్ఫూర్తి అని నెటిజన్లు కొనియాడుతున్నారు.
Similar News
News February 24, 2026
సైబర్ కేటుగాళ్లు… నిందితుల్లో బ్యాంకు అధికారులు

TG: దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న మోసగాళ్ల గుట్టును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టుచేశారు. ఆక్టోపస్ పేరుతో భారీ ఆపరేషన్ చేపట్టి 16 రాష్ట్రాల్లో 104 మంది కేటుగాళ్లను అరెస్టు చేశారు. వీరిలో బ్యాంకు అధికారులు ఉండడం గమనార్హం. వీరు ₹127 కోట్లకు పైగా కొట్టేశారు. నిందితుల నుంచి ₹36 లక్షల నగదు, 200కు పైగా మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. కాగా వీరిపై 1,055 కేసులు ఉన్నట్లు గుర్తించారు.
News February 24, 2026
ఇందాపూర్తో హెరిటేజ్కు సంబంధం లేదు: CBN

AP: హెరిటేజ్పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని CM CBN అసెంబ్లీలో మండిపడ్డారు. ‘నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి ఏ దేవాలయానికి పాలు, నెయ్యి సరఫరా చేయొద్దని నిర్ణయించుకున్నాం. ఇందాపూర్తో హెరిటేజ్కు సంబంధమే లేదు. వాళ్లు మదర్ డెయిరీ, పతంజలి, డీమార్ట్, రిలయన్స్, హెరిటేజ్కు కో- మాన్యుఫాక్చరింగ్ చేస్తున్నారు. మీరు చేసిన తప్పును తప్పించుకోవడానికి నాటకాలు ఆపండి’ అని YCP నేతలకు వార్నింగ్ ఇచ్చారు.
News February 24, 2026
కీరదోసలో గుమ్మడి పెంకు పురుగు – నివారణ

కీరదోస మొక్కలు మొలకెత్తిన తర్వాత గుమ్మడి పెంకు పురుగులు లేత ఆకులను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తాయి. ఈ సమయంలో ఈ పురుగుల నివారణకు ట్రైక్లోఫోరాన్ (5%) పొడిమందును చల్లాలి. 10 రోజుల తర్వాత మళ్లీ చల్లాలి. అలాగే తీగ పాకే సమయంలోనూ ఈ పెంకు పురుగులు పంటను ఆశించి ఆకులకు నష్టం కలిగిస్తాయి. అప్పుడు వాటి నివారణకు లీటరు నీటికి డైక్లోరోవాస్ 1.2ml లేదా ట్రైకోఫోరాన్ 2ml లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.


