News January 2, 2025

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘తల్లికి వందనం’?

image

AP: ‘తల్లికి వందనం’ పథకంపై మంత్రివర్గం చర్చించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ స్కీం అమలు చేయాలని చర్చించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలు త్వరలోనే ఖరారు చేయనున్నారు. కాగా ఈ పథకం కింద చదువుకునే ప్రతి విద్యార్థికీ ప్రభుత్వం ఏడాదికి రూ.15 వేలు అందించనుంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ ఈ పథకం వర్తిస్తుందని ఎన్డీయే కూటమి మేనిఫెస్టోలో తెలిపింది.

Similar News

News November 18, 2025

ALERT: ఫోన్ IMEI నంబర్ మారుస్తున్నారా?

image

ఫోన్లలోని 15 అంకెల IMEI నంబర్‌ను మార్చడం నాన్ బెయిలబుల్ నేరం కిందికి వస్తుందని టెలికం శాఖ హెచ్చరించింది. మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.50 లక్షల జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. తయారీదారులు, బ్రాండ్ ఓనర్లు, ఇంపోర్టర్లు, సెల్లర్లకు అడ్వైజరీ జారీ చేసింది. నిబంధనలకు లోబడి ఉండాలని సూచించింది. ఐఎంఈఐని మార్చేందుకు ఉపయోగించే పరికరాలను కలిగి ఉండటం కూడా నేరమేనని వార్నింగ్ ఇచ్చింది.

News November 18, 2025

ALERT: ఫోన్ IMEI నంబర్ మారుస్తున్నారా?

image

ఫోన్లలోని 15 అంకెల IMEI నంబర్‌ను మార్చడం నాన్ బెయిలబుల్ నేరం కిందికి వస్తుందని టెలికం శాఖ హెచ్చరించింది. మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.50 లక్షల జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. తయారీదారులు, బ్రాండ్ ఓనర్లు, ఇంపోర్టర్లు, సెల్లర్లకు అడ్వైజరీ జారీ చేసింది. నిబంధనలకు లోబడి ఉండాలని సూచించింది. ఐఎంఈఐని మార్చేందుకు ఉపయోగించే పరికరాలను కలిగి ఉండటం కూడా నేరమేనని వార్నింగ్ ఇచ్చింది.

News November 18, 2025

నేడు ఇలా చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి

image

కృష్ణాంగారక చతుర్దశి ఎన్నో శుభాలను కలిగించే పవిత్రమైన రోజు. నేడు ఎర్ర పూలు/కుంకుమ కలిపిన నీటితో స్నానం చేస్తే అంగారకుడి కటాక్షం కలుగుతుందట. ఆదిత్య మంత్రం 12 సార్లు పలికితే సూర్యుడు అనుగ్రహిస్తాడని నమ్మకం. పితృ తర్పణంతో రుణ బాధలు తొలగి, సంతోషంగా ఉంటారట. గోధుమలు దానమిస్తే జాతకంలో రవి బలం బాగుంటుందట. యమ దీపం వెలిగిస్తే అప్పుల బాధలు తొలగి, కుజ దోషం పోయి సొంతింటి కల నెరవేరుతుందని పండితులు అంటున్నారు.