News February 12, 2025
ఈ ఏడాదే తల్లికి వందనం, బడ్జెట్లో నిధులు: సీఎం

AP: ఈ నెల 28న అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రతిపాదనలు, బడ్జెట్ కూర్పుపై మంత్రి పయ్యావుల, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలను ఈ ఏడాది నుంచి ప్రారంభించాలని, బడ్జెట్లో నిధులు కేటాయించాలని తెలిపారు. అలాగే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల సమతూకంపైనా చర్చిస్తున్నారు.
Similar News
News October 23, 2025
ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వీ యాదవ్?

బిహార్ మహాఘట్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని ఆర్జేడీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఆ కూటమిలో సీట్ల పంపకాల వివాదం సద్దుమణిగినట్లు తెలుస్తోంది.
News October 23, 2025
RBI వద్ద ఎంత బంగారం ఉందో తెలుసా?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారం నిల్వలను క్రమంగా పెంచుకుంటోంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 880 టన్నుల రిజర్వులు ఉన్నట్లు RBI తాజా డేటా వెల్లడించింది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఇది $95 బిలియన్ (రూ.8.36 లక్షల కోట్లు)తో సమానం. 2025-26 FY తొలి 6 నెలల్లోనే 600 కేజీలను కొనుగోలు చేసింది. అంతర్జాతీయంగా ఆర్థిక, రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతున్నాయని ఆర్బీఐ వెల్లడించింది.
News October 23, 2025
రష్యా ప్రధాన ఆయిల్ కంపెనీలపై యూఎస్ ఆంక్షలు

రష్యా ప్రధాన ఆయిల్ కంపెనీలైన రాస్నెఫ్ట్, లూకోయల్పై యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలు విధించారు. దీంతో ఆ సంస్థలతో యూఎస్ వ్యక్తులు, సంస్థలు ఎలాంటి వాణిజ్యం చేయకుండా నిషేధం అమలులో ఉండనుంది. ఈ చర్యలు రష్యా శక్తి వనరులపై ఒత్తిడిని పెంచి, ఆ దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనం చేస్తాయని పేర్కొన్నారు. శాంతికి తామే మొగ్గుచూపుతామని, ఉక్రెయిన్తో కాల్పుల విరమణకు అంగీకరించాలని రష్యాను కోరారు.