News August 7, 2024

2016లోనూ ఇలాగే..

image

పారిస్ ఒలింపిక్స్‌లో 50 కేజీల విభాగంలో 100 గ్రాములు అధిక బరువు కారణంగా భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ డిస్‌క్వాలిఫై అయిన విషయం తెలిసిందే. అయితే, 2016లోనూ ఒలింపిక్ క్వాలిఫైయింగ్ ఈవెంట్‌లోని 48 కేజీల విభాగంలో అధిక బరువు కారణంగా ఫొగట్‌పై అనర్హత వేటు పడింది. ఆమె 48 కేజీల కంటే 400 గ్రాములు ఎక్కువ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.

Similar News

News November 21, 2025

‘పసిడి’ పంచ్.. ఫైనల్లో గెలిచిన నిఖత్ జరీన్‌‌

image

వరల్డ్ బాక్సింగ్ కప్‌ ఫైనల్లో నిఖత్ జరీన్ విజయం సాధించారు. 51 కిలోల విభాగంలో స్వర్ణ పతకం కైవసం చేసుకున్నారు. జువాన్ యి గువో (చైనీస్ తైపీ)పై 5-0 తేడాతో ఏకపక్ష విజయాన్ని నమోదు చేశారు. నిఖత్ గెలుపుతో ఈ టోర్నీలో భారత మహిళలు గెలిచిన గోల్డ్ మెడల్స్ సంఖ్య 5కు చేరింది. మొత్తంగా ఈ టోర్నీలో 9 గోల్డ్, 6 సిల్వర్, 5 బ్రాంజ్ మెడల్స్‌ను భారత్ సాధించింది.

News November 21, 2025

టుడే టాప్ న్యూస్

image

*పదోసారి బిహార్ CMగా నితీశ్ కుమార్ ప్రమాణం.. పాల్గొన్న PM మోదీ, అమిత్ షా, CM చంద్రబాబు
*అక్రమాస్తుల కేసులో HYD నాంపల్లి CBI కోర్టుకు హాజరైన AP మాజీ సీఎం జగన్
* కేంద్రమంత్రి బండి సంజయ్, మాజీమంత్రి కేటీఆర్‌పై నమోదైన కేసులు కొట్టేసిన హైకోర్టు
* ఫార్ములా ఈ-రేస్ కేసులో KTRపై ఛార్జ్‌షీట్ దాఖలకు గవర్నర్ అనుమతి
* పార్టీ ఫిరాయింపు MLAల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ పూర్తి

News November 21, 2025

సిట్‌కు అన్నీ వాస్తవాలే చెప్పా: వైవీ సుబ్బారెడ్డి

image

AP: కల్తీ నెయ్యి వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డి నివాసంలో సిట్ విచారణ ముగిసింది. తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. సిట్‌కు అన్నీ వాస్తవాలే చెప్పానని తెలిపారు. దర్యాప్తుకు అన్ని విధాలుగా సహకరిస్తానని అన్నారు. కల్తీ నెయ్యి విషయంలో నిజానిజాలు ప్రజలకు తెలియాలనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశానని చెప్పారు. 2018 తర్వాతి నుంచి చిన్న అప్పన్న తన దగ్గర పీఏగా పని చేయడం లేదని పేర్కొన్నారు.