News June 24, 2024
అన్ని ఫోన్లకు ఒకే టైప్ ఛార్జర్.. 2025 జూన్ వరకు గడువు
అన్ని కంపెనీల ఫోన్లకు ఒకే టైప్ ఛార్జర్ ఉండాలనే నిబంధనను కేంద్రం తీసుకురానుంది. టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్ మాత్రమే ఉండేలా కొత్త మార్గదర్శకాలు అమల్లోకి తేనుంది. దీనికి 2025 జూన్ వరకు గడువు విధించింది. ఇకపై కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులను సీ టైప్ ఛార్జింగ్ పోర్టు ఉండేలా తయారు చేయాలంది. ఇప్పటికే యురోపియన్ యూనియన్లో ఈ రూల్ అమలవుతోంది. 2026 చివరి నుంచి ల్యాప్టాప్లకూ ఈ నిబంధనను అమలు చేయనున్నట్లు సమాచారం.
Similar News
News October 9, 2024
టాప్-10లోకి దూసుకొచ్చిన అర్ష్దీప్
ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్లో టీమ్ ఇండియా స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ తొలిసారి టాప్-10లోకి దూసుకొచ్చారు. భారత్ తరఫున అర్ష్దీప్ ఒక్కరే టాప్-10లో ఉన్నారు. ఆల్రౌండర్ ర్యాంకింగ్స్లో హార్దిక్ పాండ్య 3, అక్షర్ పటేల్ 11వ స్థానం దక్కించుకున్నారు. బ్యాటింగ్ విభాగంలో సూర్యకుమార్ యాదవ్ 2, యశస్వీ జైస్వాల్ 4, రుతురాజ్ గైక్వాడ్ 9వ స్థానంలో ఉన్నారు.
News October 9, 2024
ఈ జిల్లాలకు వర్ష సూచన: APSDMA
AP: రేపు అల్లూరి, ఎన్టీఆర్, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది.
News October 9, 2024
జెత్వానీకి ఎస్కార్టు ఎందుకు?: వెల్లంపల్లి
AP: దుర్గమ్మ దర్శనానికి వెళ్లిన విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మిని రోడ్డుపై నిలిపేసి, నటి కాదంబరి జెత్వానీని ఎస్కార్టుతో పంపడం దారుణమని వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రులు జరుగుతున్న తీరు చూస్తుంటే బాధేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘పవన్ రాకతో సాధారణ భక్తులను దర్శనానికి అనుమతించలేదు. ఉచిత బస్సుల్లో వృద్ధులను ఎక్కించుకోవటం లేదు’ అని ఆయన ఫైర్ అయ్యారు.