News February 18, 2025
శామ్సంగ్ S24 Ultra ధర ₹70,000.. ఎక్కడంటే?

మొబైల్ ఫోన్ల ధరలను పోల్చినప్పుడు ఇండియాలో ఎక్కువగా ఉండటంపై వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వివిధ కంపెనీల ఫోన్ల ధరలు దుబాయ్లో తక్కువగా ఉంటాయంటారు. SAMSUNG కంపెనీకి చెందిన S24 Ultra (12/256 GB) ఫోన్ దుబాయ్లో సుమారు ₹70,000లకే లభిస్తుంది. అదే ఇండియాలో ₹1,04,999 (ఆన్లైన్ షాపింగ్ సైట్). దాదాపు ట్యాక్సుల రూపంలో ₹35,000 అధికంగా వసూలు చేయడంపై నెట్టింట విమర్శలొస్తున్నాయి.
Similar News
News November 10, 2025
ప్రెగ్నెంట్లు పారాసిటమాల్ వాడొచ్చు: సైంటిస్టులు

గర్భిణులు పారాసిటమాల్ వాడితే పిల్లలకు ఆటిజమ్/ADHD వస్తుందనే వాదనకు ఆధారాలు లేవని బ్రిటిష్ మెడికల్ జర్నల్ వెల్లడించింది. ప్రెగ్నెంట్లు పారాసిటమాల్/ఎసిటమినోఫెన్ లాంటి పెయిన్ కిల్లర్లు వాడొద్దని ఇటీవల ట్రంప్ పిలుపునివ్వడంతో సైంటిస్టులు పరిశోధన చేశారు. ‘ప్రెగ్నెన్సీలో హై ఫీవర్ బిడ్డపై ప్రభావం చూపుతుంది. పారాసిటమాల్ సురక్షితమైన డ్రగ్. కచ్చితంగా తీసుకోవచ్చు’ అని WHO మాజీ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య తెలిపారు.
News November 10, 2025
స్పీకర్పై BRS కోర్టు ధిక్కార పిటిషన్

TG: ఫిరాయింపు MLAలపై నిర్దేశించిన 3 నెలల గడువులోగా చర్యలు తీసుకోలేదని TG స్పీకర్పై BRS పార్టీ న్యాయవాది మోహిత్రావు SCలో ధిక్కార పిటిషన్ వేశారు. అత్యవసరంగా దీనిపై విచారించాలని కోరారు. ఉద్దేశపూర్వకంగా స్పీకర్ ఆలస్యం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈనెల 23న ప్రస్తుత CJI రిటైర్ అవుతారని, కొత్త CJI వస్తే మొదట్నుంచి విచారించాల్సి ఉంటుందని వివరించారు. వచ్చే సోమవారం విచారిస్తామని జస్టిస్ గవాయ్ చెప్పారు.
News November 10, 2025
సంక్రాంతికి ఊరెళ్తున్నారా? రైల్వే టికెట్ బుకింగ్స్ మొదలు!

వచ్చే సంక్రాంతికి (జనవరి 2026) ఊళ్లకు వెళ్లాలనుకునేవారికి అలర్ట్. భారతీయ రైల్వే టికెట్ బుకింగ్స్ 60 రోజుల ముందుగానే ప్రారంభమవుతాయి. ఇవాళ జనవరి 9వ తేదీవి, రేపు JAN 10, ఎల్లుండి JAN 11, గురువారం రోజున జనవరి 12వ తేదీకి సంబంధించిన టికెట్లు రిలీజ్ కానున్నాయి. సొంతూళ్లకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండి IRCTC అధికారిక వెబ్సైట్ లేదా యాప్ ద్వారా వెంటనే బుక్ చేసుకోవచ్చు. SHARE IT


