News August 14, 2024
ఆన్లైన్లో ఇసుక బుకింగ్: చంద్రబాబు

AP: ఉచిత ఇసుక ఇస్తున్నా తమపై బురదజల్లేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. కూలీలు, సీనరేజ్, రవాణా ఖర్చులనే ప్రజలు చెల్లించాలని సూచించారు. అన్ని సచివాలయాల్లో ఇసుక బుక్ చేసుకునే సౌకర్యం తీసుకొస్తామని చెప్పారు. ఆన్లైన్ ద్వారా బుకింగ్ సదుపాయం కల్పిస్తామని పేర్కొన్నారు. 60 రోజుల పాలనలో ఆర్థిక ఇబ్బందులు, వాటి పరిష్కారంపై దృష్టిసారించామని ఆయన చెప్పారు.
Similar News
News November 20, 2025
ఢిల్లీ బ్లాస్ట్.. నలుగురు కీలక నిందితుల అరెస్ట్

ఢిల్లీ పేలుడు కేసులో మరో నలుగురు కీలక నిందితులను NIA అరెస్ట్ చేసింది. డా.ముజమ్మిల్ షకీల్(పుల్వామా), డా.అదీల్ అహ్మద్(అనంత్నాగ్), డా.షాహీన్ సయిద్(యూపీ), ముఫ్తీ ఇర్ఫాన్(J&K)ను పటియాలా కోర్టు ఆదేశాలతో కస్టడీలోకి తీసుకుంది. ఎర్రకోట పేలుడులో వీరు కీలకంగా వ్యవహరించినట్లు NIA గుర్తించింది. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య ఆరుకు చేరింది.
News November 20, 2025
త్వరలో రెస్టారెంట్లు, సొసైటీల్లో ఎంట్రీకి ఆధార్!

ఆధార్ విషయంలో త్వరలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రెస్టారెంట్లలో లైవ్ ఈవెంట్కు వెళ్లాలన్నా, హౌసింగ్ సొసైటీల్లోకి ఎంట్రీ కావాలన్నా, ఏదైనా ఎగ్జామ్ రాయాలన్నా మీ గుర్తింపు కోసం ఆధార్ చూపించాల్సి రావొచ్చు. ఆఫ్లైన్ ఆధార్ వాడకాన్ని పెంచాలనే ఉద్దేశంతో UIDAI ఈ తరహా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వ్యక్తుల ప్రైవసీకి కూడా ఇది ఉపయోగపడుతుందని ఆ సంస్థ చెబుతోంది.
News November 20, 2025
TMC-HBCHలో ఉద్యోగాలు

విశాఖపట్నంలోని <


