News February 7, 2025
ఇసుక తవ్వకాల కేసు.. తుది నివేదిక సమర్పించాలని సుప్రీం ఆదేశం

AP: YCP హయాంలో జరిగిన ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తవ్వకాలన్నీ ఆపేసినట్లు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనానికి జయప్రకాశ్ పవర్ వెంచర్స్ న్యాయవాది తెలిపారు. అటు గత విచారణ తర్వాత తీసుకున్న చర్యలను ప్రభుత్వం వివరించింది. దీంతో తుది నివేదిక దాఖలు చేయాలని సుప్రీం ఆదేశించింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ గమనించిన అంశాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది.
Similar News
News October 21, 2025
గ్రామాల రక్షణకు మహిళల గ్రీన్ ఆర్మీ

UP వారణాసి గ్రామాల్లో పరిశుభ్రత, చైతన్యం కోసం మహిళలతో ఏర్పడిన గ్రీన్ఆర్మీ ఎన్నో సాంఘిక సంస్కరణలు చేస్తోంది. 2015లో రవిమిశ్ర అనే వ్యక్తి ప్రారంభించిన ఈ ఉద్యమం 22 జిల్లాలకు విస్తరించింది. ప్రస్తుతం ఈ ఆర్మీలో 2,200 మంది మహిళలు ఉన్నారు. వీరు గృహహింస, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు సహకరిస్తున్నారు. చెప్పులు, నారసంచుల తయారీతో ఉపాధి కూడా పొందుతున్నారు. వీరి కృషిని గుర్తించి PM మోదీ కూడా అభినందించారు.
News October 21, 2025
56 ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

AP: చిత్తూరు DHMO 56 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్, డిగ్రీ, MBBS, CA, Mcom, MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. విద్యార్హతలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://chittoor.ap.gov.in/
News October 21, 2025
నవంబర్ 19న చీరల పంపిణీ!

TG: మహిళా సంఘాల సభ్యులకు చీరల పంపిణీకి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న ‘ఇందిరా మహిళా శక్తి’ పేరుతో వీటిని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. బతుకమ్మ పండగకే చీరలు ఇవ్వాల్సి ఉండగా అవి సిద్ధం కాకపోవడంతో వాయిదా పడింది. నవంబర్ 15 నాటికి తయారీ పూర్తిచేసి 19న పంచాలని భావిస్తోంది.