News August 22, 2024

సందీప్ ఘోష్ పాలిగ్రాఫ్ టెస్టుకు కోర్టు అనుమతి

image

ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌కు CBI పాలిగ్రాఫ్ టెస్టు చేయనుంది. వారం రోజులుగా ప్రశ్నిస్తున్నా సంతృప్తికర సమాధానాలు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు ప్రత్యేక కోర్టు నేడు అనుమతి ఇచ్చింది. అతడితో పాటు వైద్యురాలి హత్యాచారం జరిగిన రాత్రి విధుల్లో ఉన్న నలుగురు డాక్టర్లనూ పరీక్షిస్తారు. పాలిగ్రాఫ్ ఫలితాలను కోర్టులు అంగీకరించవు. దర్యాప్తునకు అవసరమైన ఆధారాలు దొరుకుతాయని ఇలా చేస్తారు.

Similar News

News November 24, 2025

వన్డేలకు రెడీ అవుతున్న హిట్‌మ్యాన్

image

ఈ నెల 30 నుంచి సౌతాఫ్రికాతో జరిగే 3 వన్డేల సిరీస్ కోసం రోహిత్ శర్మ సిద్ధం అవుతున్నారు. గత 5, 6 రోజులుగా అతడు బెంగళూరు ట్రైనింగ్ సెంటర్‌లో ఉన్నారు. ఫిట్‌నెస్ పెంచుకోవడంతో పాటు ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లతో స్పెషల్ సెషన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి. మరోవైపు తాను జిమ్‌లో గడిపే ఫొటోలను రోహిత్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

News November 24, 2025

హేమమాలినితో హగ్స్ కోసం ధర్మేంద్ర ఏం చేశారంటే..?

image

‘షోలే’ మూవీ షూటింగ్‌లో<<18374925>>ధర్మేంద్ర<<>> ఓ కొంటె పని చేశారు. హీరోయిన్ హేమమాలినితో హగ్స్ కోసం స్పాట్ బాయ్స్‌కు లంచం ఇచ్చారు. షాట్ మధ్యలో అంతరాయం కలిగించాలని వారికి చెప్పారు. రీటేక్ తీసుకునేలా చేసినందుకు ₹20 చొప్పున ₹2 వేలు స్పాట్ బాయ్స్‌కు ఇచ్చారు. అంటే దాదాపు 100 వరకు రీటేక్స్ తీసుకున్నారు. షోలే 1975లో రిలీజ్ కాగా, వీరిద్దరూ నాటకీయ పరిణామాల మధ్య 1980లో పెళ్లి చేసుకున్నారు.

News November 24, 2025

ఢిల్లీ కాలుష్యం: సగం మందే ఆఫీసులకు

image

గాలి కాలుష్యం తీవ్రం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులను 50% మందితోనే నిర్వహించాలని, మిగతా వారు ఇంటి నుంచే పని చేయాలని ఆదేశాలిచ్చింది. GRAP-3లో భాగంగా వాహనాల రాకపోకలను నియంత్రించాలన్న ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ సూచనలతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎయిర్ క్వాలిటీ తీవ్రంగా ఉన్నప్పుడు పిల్లలను బహిరంగ ప్రదేశాల్లో ఆడుకోనివ్వొద్దని ఇప్పటికే ఆంక్షలు విధించింది.